వెంకీతో ఆగిపోలేదు.. ఆపారంతే..

Update: 2017-03-19 07:22 GMT
పూరీ జగన్నాధ్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు బాలయ్య కంటే ముందే వెంకీతో పూరీ ఓ సినిమా చేస్తాడనే టాక్ నడించింది. కానీ బడ్జెట్ సమస్యలతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారనే టాక్ వినిపించింది.

కానీ పూరీ-వెంకీ ప్రాజెక్టు ఆపేయలేదని.. అప్పటికి హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. వెంకీ క్రిష్ తో అనుకున్న సబ్జెక్ట్ కానీ.. కిషోర్ తిరుమలతో అనుకున్న ఆడాళ్లూ మీకు జోహార్లు కానీ.. పట్టాలెక్కలేదు. పైగా ఇప్పుడు కుర్ర హీరోలతో క్రిష్.. రామ్ తో కిషోర్ తిరుమల సినిమాలు చేసేయనున్నారు. వీటన్నిటి కంటే పూరీ చెప్పిన దేశభక్తి స్టోరీపైనే ఎక్కువ గురి కుదిరందట వెంకీ. దీంతో తన తర్వాతి సినిమాను పూరితోనే చేయనున్నాడట వెంకటేష్. బాలయ్య సినిమాను పూరీ రీసెంట్ గా మొదలుపెట్టడంతో.. మధ్యలో వెంకీ మరో సినిమా పూర్తి చేసే అవకాశాలున్నా.. వాటిని పట్టించుకోవడం లేదట.

సహజంగా సమ్మర్ లో సినిమాలు చేసే అలవాటు వెంకటేష్ కు లేదు. అంటే జూన్ చివరి వరకూ వెంకీ షూటింగ్ లలో పాల్గొనడు. ఆ పాటికి.. బాలయ్యతో పూరీ సినిమా సగానికి పైగా పూర్తయిపోతుంది. ఆ తర్వాత అక్టోబర్ లో ఈ మాస్ డైరెక్టర్ తీసే దేశభక్తి చిత్రాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడట వెంకటేష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News