ప్రియురాలిని పెళ్లాడుతున్న కుర్ర‌హీరో.. అతిథుల జాబితా ఇదే!

Update: 2021-01-20 08:34 GMT
బాల్య స్నేహితురాలు.. త‌న‌ ప్రియురాలు నటాషా దలాల్ ని పెళ్లాడేందుకు యువ‌హీరో వ‌రుణ్ ధావన్ సిద్ధ‌మ‌వుతున్నాడు. తమ అనుబంధాన్ని ఈ జంట‌ త్వరలో తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. లవ్ బర్డ్స్ జనవరి 24 న కుటుంబ సభ్యులు .. సన్నిహితుల సమక్షంలో పెళ్లాడేందుకు రెడీ అవుతున్నారు. ఈ పెళ్లి చాలా ప్ర‌యివేట్ వ్యవహారంలా సింపుల్ గా జ‌ర‌గ‌నుంది.

నిజానికి 2020 మేలో నే ఈ జంట పెళ్లికి సిద్ధ‌మైనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. ఇప్పుడు త్వరలోనే అలీబాగ్ ‌లోని బీచ్ రిసార్ట్ లో జ‌రిగే ఆత్మీయ వేడుకలో పెళ్లిబంధంతో ఒక‌ట‌వుతార‌ని తెలుస్తోంది.

అంతకుముందు వరుణ్ -నటాషా వివాహం ఐదు రోజుల డెస్టినేష‌న్ వెడ్డింగ్ కానుందని ప్ర‌చారం సాగింది. కానీ ముంబై మీడియా నివేదిక‌ ప్రకారం.. కేవ‌లం ఒకరోజు వేడుకలను ప్లాన్ చేశారు. ‘షాదీ’ పగటిపూట జరగబోతోంది. తరువాత సాయంత్రం ప‌రిమిత అతిథుల‌తో సింపుల్  రిసెప్షన్ ఉంటుంది. మహమ్మారి కారణంగా భద్రతా పరిమితుల ప్రకారం  మొత్తం 50 మంది అతిథులను మాత్ర‌మే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అతిథుల‌ జాబితాలో ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ (వరుణ్ గురువు)- సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్ ఉన్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు .. దంపతుల పాఠశాల స్నేహితులు మాత్రమే హాజరవుతారు. గత వారం, ఇరుకుటుంబాలు రిసెప్షన్ కోసం ఇ-ఆహ్వానాలను పంపాయి అని తెలిసింది. షారుఖ్ ఖాన్ వివాహానికి హాజరు కాలేకపోవచ్చని తెలుస్తోంది.

క‌ర‌ణ్‌.. సల్మాన్ కాకుండా ఇతర అతిథుల్లో రెమో డిసౌజా .. శశాంక్ ఖైతాన్ - శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా- వాషు భగ్నాని తదితరులు ఉన్నారు. డేవిడ్ డయాబెటిస్ తో చాలాకాలంగా గుండెపోటుతో బాధపడుతున్నందున కుమారులు వరుణ్ .. రోహిత్ గొప్ప రిసెప్షన్ ఇవ్వడం ద్వారా అతని ఆరోగ్యాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడరు అని కూడా తెలుస్తోంది.

వెన్యూ మాండ్వా జెట్టీకి వెళ్ళడానికి అతిథులు గేట్వే ఆఫ్ ఇండియా నుండి ప్రైవేట్ పడవల్లోకి వెళ్తారు. అక్కడ నుండి ప్రైవేట్ కార్లు వారిని  వివాహ వేడుక కోసం బుక్ చేసిన బీచ్ రిసార్టుల‌కు తీసుకువెళతాయి.
Tags:    

Similar News