బాలకృష్ణ సినిమాలో 'క్రాక్' లేడీ విలన్?

Update: 2021-04-18 23:30 GMT
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లను దడదడలాడించిన సినిమాల్లో 'క్రాక్' ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఎక్కువ మార్కులు కొట్టేసింది. రవితేజ కెరియర్లోనే అతధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమాలో లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ దుమ్మురేపేసింది. హీరోతో పాటు అందుకు సమానమైన గుర్తింపు ఆమె పాత్రకు లభించింది. ఆ పాత్రకి ఆమెనే కరెక్ట్ .. అంత బాగా మరెవరూ చేయలేరనే టాక్ వినిపించింది. ఆమెను ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక పవర్ఫుల్ స్టోరీని అనుకున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఆ పాత్రను గోపీచంద్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడని అంటున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ పాత్రను డిజైన్ చేశాడని చెబుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కి విలన్ గా చేయడం కొత్తేమీ కాదు .. కానీ ఈ తరహా పాత్ర మాత్రం ఇంతవరకూ చేయలేదనే అంటున్నారు. సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి సినిమా 'అఖండ' షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన వైవిధ్య భరీతమైన రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి రైతు పాత్ర అయితే మరొకటి అఘోర పాత్ర. పొంతన .. పోలిక లేని ఈ పాత్రల మధ్య సంబంధం ఏమిటనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళతారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకోనున్నారనే వార్త నిజమే అయితే, కచ్చితంగా అది ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Tags:    

Similar News