పుసుక్కున చైతు సినిమా సంగతి చెప్పేసిన ఛానెల్!

Update: 2019-09-12 11:30 GMT
అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  చైతు డెబ్యూ సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కింది.  అయితే అప్పటి నుండి ఇప్పటివరకూ చైతు-దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయింది.  ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను మేము తీసుకున్నామంటూ ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని టీవి ప్రకటించింది.  నాగ చైతన్య-రష్మిక మందన్న సినిమా 'అదే నువ్వు అదే నేను' సినిమా శాటిలైట్ రైట్స్ జెమిని టీవీ ఛానెల్ తీసుకుందని సగర్వంగా ప్రకటించింది.  అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ సినిమా గురించి దిల్ రాజు నుండి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. షూటింగ్ సంగతి కూడా తెలియదు.. సినిమా టైటిల్ కూడా తెలియదు.. ఇవన్నీ నిర్మాతలు ప్రకటించేలోపే పుసుక్కున ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు అయింది.

నిజానికి ఈ టైటిల్ తో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ను పరిచయం చేస్తూ ఒక సినిమాను ప్లాన్ చేశారు.  అయితే ఆ సినిమా ఆగిపోయింది.  అదే కథతో ఇప్పుడు రాజ్ తరుణ్-షాలిని పాండేతో దిల్ రాజు సినిమా చేస్తున్నారు.  ఇక టైటిల్ మాత్రం రాజ్ తరుణ్ కోసం వాడకుండా చైతు సినిమాకు ఫిక్స్ చేశారన్నమాట.  ఏదేమైనా టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

    

Tags:    

Similar News