గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసిన స్టార్ హీరోయిన్...!

Update: 2020-10-03 16:40 GMT
ప్రస్తుతం దేశంలో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' విస్తృతంగా నడుస్తోంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ మూడో దశకు చేరుకుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ ఛాలెంజ్ లో సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజలు వరకు అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. స్వయంగా మొక్కలు నాటడంతో పాటు ఇతరులను నామినేట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ త్రిష కూడా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చింది.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా త్రిష తన ఫాంహౌస్‌ లో రెండు మొక్కలు నాటారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను యాక్సెప్ట్ చేసి ఈ రోజు రెండు మొక్కలను నాటాను. మీరందరూ కూడా మీవంతుగా మొక్కలు నాటి పచ్చని భారతదేశ రూపకల్పనకు సహాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను'' అని త్రిష ట్వీట్ చేసింది. కాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి త్రిష ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News