భ‌ర‌త్ అంద‌రికీ న‌చ్చేశాడుగా

Update: 2018-04-21 10:20 GMT

కొర‌టాల శివ‌-మ‌హేష్ కాంబో మూవీ భ‌ర‌త్ అను నేను సినిమా మ‌హేష్ అభిమానుల‌కే కాదు టాలీవుడ్‌ లోని ఎంతో మంది స్టార్స్ కూడా తెగ న‌చ్చేసింది. ఆ సినిమా విడుద‌ల రోజే అనుకోని వివాదాలు ఫిల్మ్ ఛాంబ‌ర్ ద‌గ్గర జ‌ర‌గ‌డంతో సినీ అభిమానులు సినీ తార‌ల ఫోక‌స్ అంతా అక్క‌డే ఉంది. దీంతో సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ పెద్ద‌గా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ వివాదాలు కాస్త స‌ద్దుమ‌ణ‌గ‌డంతో ఇప్ప‌డంద‌రూ భ‌రత్ సినిమా గురించి సోష‌ల్ మీడియాలో స్పందించ సాగారు. బెస్ట్ ఫిల్మ్ అంటూ ఎంతో మంది సినీ తార‌లు మెచ్చుకున్నారు.

శుక్ర‌వారం సినిమా విడుదలై మొద‌టి షో ముగిసిన వెంట‌నే పాజిటివ్ టాక్ వెల్లువ‌లా పాకేసింది. కానీ అదే స‌మ‌యానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ హ‌డావుడి చేయ‌డంతో భ‌ర‌త్ సినిమా ప‌క్కకు వెళ్లిపోయింది. ఫిల్మ్ ఛాంబ‌ర్ ద‌గ్గ‌ర ప‌వ‌న్ అభిమానులు కాస్త అతిగా స్పందించి మీడియా వాహ‌నాల‌పై దాడి చేయ‌డంతో అదే శుక్ర‌వారం పెద్ద విష‌యంగా మారింది. అప్ప‌టికీ రాజ‌మౌళి లాంటివాళ్లు నిన్న‌నే స్పందించారు. కొర‌టాల శివ న‌రేష‌న్ మ‌హేష్ బాబు న‌ట‌న సూప‌ర్ అంటూ మెచ్చుకున్నాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్  రకుల్ ప్రీత్ సింగ్  నిఖిల్ సిద్దార్థ   సుధీర్ బాబు  వంశీ పైడిప‌ల్లి  రాజ్ త‌రుణ్  శ్రీను వైట్ల  త‌మ‌న్  హ‌రీష్ శంక‌ర్  అనిల్ రావిపూడి ఇలా ఎంతోమంది పాజిటివ్ స్పందించారు. ప్రతి ఒక్క‌రూ సినిమా సూప‌ర్ అని మెచ్చుకున్నారు. కొర‌టాల శివ రాసుకున్న క‌థ అంద‌రికీ తెగ‌న‌చ్చేసింది.

త‌మ‌న్ ఒక అడుగు ముందుకేసి భ‌ర‌త్ అను నేను సీక్వెల్ కూడా తీయాల‌ని కొర‌టాల శివ‌ను కోరారు. రాజ‌మౌళి సుధీర్ బాబుల‌కు సినిమాలోని ప్రెస్ మీట్ తెగ న‌చ్చేసింది. సినిమాకి అదే హైలైట్ అంటున్నారు ఈ సెలెబ్రిటీలు. మ‌హేష్ కెరీర్ ఇది ఒక బెస్ట్ మూవీ అని మెచ్చుకుంటున్నారు.  దీనిని బ‌ట్టి చూస్తే నా పేరు సూర్య వ‌చ్చే దాకా రెండు వారాలు భ‌ర‌త్ అను నేను థియేట‌ర్లు నిండిపోవ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News