శృతి 1 కోటి.. తమన్నా 25 లక్షలు

Update: 2016-08-31 13:30 GMT
అంతే కదా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. అందుకే ఇప్పుడు బాగా పర్సులోకి తోసేస్తోంది మిల్కీ బ్యూటి తమన్నా. అయితే ఇది ఏ రేంజులో అంటే.. ఇతర స్టార్ హీరోయిన్లు ఎవ్వరూ కనీసం కాంపిటీషన్ కూడా రాలేనంత ఈజీగా అమ్మడు కుమ్మేస్తోంది.

నిజానికి తెలుగు-కన్నడ బాషల్లో కర్ణాటక మాజీ మంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ హీరోగా పరిచయం అవుతున్న ''జాగ్వార్‌'' సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించాలని ఎప్పటినుండో చూస్తున్నారు. కాకపోతే మొన్నటివరకు ఆ డీలింగా అంతా శృతి హాసన్ తో జరిపారు. అమ్మడు దాదాపు 1 కోటి ఇస్తే కాని సాంగ్ చేయను అనేసిందట. అందాల ఆరబోతకు సై అనేసినా కూడా.. శృతి మీద కోటి పెట్టాలంటే కాస్త జంకారు. సర్లే ఓమారు టచ్ చేద్దాం అని మిల్కీ సైరన్ తమన్నాను అడిగితే.. అమ్మడు వెంటనే 25 లక్షలకు సాంగు చేయడానికి ఒప్పుకుందట. ఇక ఐటెం పాటకు కావల్సింది అందాలే కాబట్టి.. మిల్కీ అభయహస్తం ఉన్నప్పుడు ఆ విషయంలో అస్సలు జంకాల్సిన అవసరమే లేదు.

ఇప్పటివరకు కెరియర్ లో రెండుసార్లు ఐటెం సాంగులు చేసింది మిల్కీ బ్యూటి. అవి రెండూ కూడా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తోనే చేసింది. ఇప్పుడు తన మూడో ఐటెంను ఈ కొత్త కుర్రాడితో చేస్తోందనమాట.
Tags:    

Similar News