అక్కినేనివారి మేనకోడలు ఆదరగొట్టిందట!

Update: 2018-08-03 11:46 GMT
అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోయిన్ గా 1996  లో తెలుగు తెరకు పరిచయమైంది.  ఆ సినిమా పవన్ కళ్యాణ్ కు డెబ్యూ సినిమా అనే విషయం తెలిసిందే కదా.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారాడు గానీ సుప్రియ మాత్రం మరో సినిమాలో నటించలేదు.  దాదాపు 22 ఏళ్ళ తర్వాత అడివి శేష్ 'గూఢచారి' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడం ద్వారా టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇచ్చింది.  ఈ రోజే 'గూఢచారి' రిలీజ్ అయిన విషయం తెలిసిందే కదా.

సుప్రియ ఈ సినిమాలో  రా-ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో  మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా కనిపించింది.  అడివి శేష్ తదితరులున్న త్రినేత్ర టీమ్ కు తను క్రావ్ మగ అనే మార్షల్ ఆర్ట్స్ ఫామ్ లో శిక్షణనిస్తుంది.  సినిమాలో సుప్రియది ఓ అతిథి పాత్ర మాత్రమే అని ప్రచారం సాగినా అందుకు భిన్నంగా సినిమా అంతా కనిపించే పాత్ర దక్కింది.  ఒక రకంగా సుప్రియకు 'గూఢచారి' సినిమా ద్వారా సూపర్ రీ-ఎంట్రీ లభించినట్టే.

ఈ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ సుప్రియకు మరికొన్ని ప్రాధాన్యత కలిగిన రోల్స్ ఆఫర్ చేసే అవకాశం ఉంది.  మరోవైపు 'గూఢచారి' సినిమా మంచి టాక్ తో ఓపెన్ కావడం విశేషం. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ కు కుడా ప్రశంసలు లభిస్తున్నాయి.
Tags:    

Similar News