కండల వీరుడితో ఈగ విలన్ సై

Update: 2017-03-24 08:16 GMT
కన్నడ పరిశ్రమలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సుదీప్. ఈ వెర్సటైల్ యాక్టర్ తాను ఎంతటి ప్రతిభావంతుడో.. జక్కన్న చెక్కిన ఈగ చిత్రంలోనే చూపించాడు. విలన్ గా తనదైన నటనతో ఆ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాడు. ఇప్పుడు మరోసారి విలన్ పాత్ర చేసేందుకు సుదీప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి సుదీప్ తన విలనిజాన్ని బాలీవుడ్ కి రుచి చూపించబోతున్నాడట. అది కూడా కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో చేయనుండడం విశేషం. ప్రస్తుతం సల్లూ భాయ్ టైగర్ జిందా హై మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఏక్ థా టైగర్ కు  సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ మూవీలో హీరోయిన్ గా తన మాజీ లవర్ కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా తీసుకుని ఆశ్చర్యపరిచాడు సల్మాన్. ఇప్పుడు విలన్ పాత్రకు సుదీప్ ను ఎంచుకోవడం మరో హైలైట్ అయిపోతోంది.

అయితే.. టైగర్ జిందా హై చిత్రంలో సుదీప్ విలనిజాన్ని.. అటు సినిమా యూనిట్ కానీ.. ఇటు సుదీప్ కానీ ఇంకా కన్ఫాం చేయలేదు. కానీ ఇప్పటికే దీనిపై ఫైనల్ డెసిషన్ కు వచ్చేశారని.. అగ్రిమెంట్స్ వ్యవహారాలు పూర్తయ్యాక.. అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. ఆలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టైగర్ జిందాహైను.. డిసెంబర్ లో విడుదల చేయనున్నాడు సల్మాన్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News