కొత్త ‘‘మా’’ బ్యాచ్ కొలువు తీరింది

Update: 2017-03-06 17:38 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. సింపుల్ గా చెప్పాలంటే.. ‘‘మా’’.  ఈ సంస్థ కొత్త కార్యవర్గం తాజాగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా సాగిన ఈ ఎన్నికలో ఇప్పటివరకూ ‘మా’కు ప్రధానకార్యదర్శిగా ఉన్న శివాజీరాజా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్.. ఉపాధ్యక్షుడిగా కమేడియన్ వేణు మాధవ్..బెనర్జీలు..  ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన దాసరి చేసిన కృషి కారణంగానే ఈసారి పోటీ లేకుండానే ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకున్నట్లుగా నరేశ్ వెల్లడించారు. గత ఏడాది జరిగిన మా ఎన్నికలు హాట్ హాట్ గా సాగటమే కాదు.. పెద్ద పోరాటమే సాగింది. సినీ నటుడు రాజేంద్రప్రసాద్ వర్సెస్ జయసుధలు పోటీకి దిగటం.. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయిన వేళ.. హోరాహోరీ ప్రకటనల నడుమ ఎన్నిక జరిగింది. ఈసారి అందుకు భిన్నంగా ఏకగ్రీవ నిర్ణయంతో ఎన్నికలు సాగటం విశేషం.
Read more!

అధ్యక్షుడిగా ఎన్నికైన శివాజీ రాజా మాట్లాడుతూ.. తనపై మా సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్న ఆయన.. ప్రస్తుతం 30 మంది కళాకారులకు ఇస్తున్న పింఛన్ ను 25 శాతానికి పెంచి ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ‘‘మా’’ 25 ఏళ్ల ఉత్సావాన్ని వైభవంగా నిర్వహించనన్నట్లు పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News