గొప్ప నటుడిపై కట్నం వేధింపుల ఆరోపణలు

Update: 2016-10-03 09:40 GMT
నవాజుద్దీన్ సిద్ధిఖి..  గత కొన్నేళ్లలో బాలీవుడ్‌ కు దొరికిన అత్యంత గొప్ప నటుల్లో ఒకడు. గ్యాంగ్స్ ఆఫ్ వస్పీపూర్.. మాంఝీ.. రమణ్ రాఘవ్ 2.0 లాంటి సినిమాలు అతడి నట ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి. నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకున్న నవాజుద్దీన్ సిద్దిఖిపై ఊహించని ఆరోఫనలు వచ్చాయి. కట్నం కోసం అతను తన సోదరుడి భార్య మీద దాడి చేసినట్లుగా అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నవాజుద్దీన్ తమ్ముడు మినాజుద్దీన్ భార్య ఆఫ్రిన్.. తనకు వరకట్న వేధింపులు ఎదురవుతున్నాయని.. నవాజుద్దీన్ కట్నం కోసం తనపై దాడికి కూడా దిగాడని ఆరోపించింది. ఈ వార్తలు మీడియాలో ప్రముఖంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవాజ్ వివరణ ఇచ్చాడు.

పబ్లిసిటీ కోసమే ఆఫ్రిన్ తనపై ఆరోపణలు చేసినట్టు ఆయన చెప్పారు. తనను సాఫ్ట్‌ టార్గెట్‌ గా భావించి.. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని.. తాను నటుడిని కావడంతో ఈ ఆరోపణలు చేయడం ద్వారా టీవీల్లో.. పత్రికల్లో కనబడవచ్చని.. మంచి పబ్లిసిటీ తెచ్చుకోవచ్చని ఆమె భావించిందని నవాజ్ ఆరోపించాడు. కట్నం కోసం తన మరదల్ని ఎప్పుడూ వేధించలేదని తెలిపాడు. నిజానికి ఆఫ్రిన్‌ మామే తన తమ్ముడు మినాజుద్దీన్‌ డబ్బు కోసం రోజూ వేధించేవాడని చెప్పాడు. తాను ఆఫ్రిన్ ను కొట్టానని చెబుతున్న రోజు.. తాను తీవ్ర జ్వరంతో ఉన్నానని.. ఆన్‌ అత్తామామలు డబ్బు కోసం ఆ రోజు తమ ఇంటికి వచ్చి గలాటా చేశారని.. తాను ఆఫ్రిన్ ను కనీసం తాకను కూడా తాకలేదని.. కావాలంటే తమ ఇంట్లో సీసీటీవీ దృశ్యాలు కూడా పరిశీలించవచ్చని నవాజ్ వివరించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News