ఫోటో స్టొరీ: మల్లెతీగలా అల్లుకున్న సాయిపల్లవి

Update: 2018-11-11 13:51 GMT
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'పడిపడి లేచే మనసు'.  ఒక బ్రీజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.  సినిమా పోస్టర్లు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా 'పడిపడి లేచే మనసు' టీమ్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

దాంతో పాటు ఈ సినిమానుండి నవంబర్ 12 వ తేదీన టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు.  ఈ పాటను హిమాలయాల్లోని స్పితి వ్యాలీలోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో చిత్రీకరించారట. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిందట. దీంతో ఆ మంచుదుప్పటి కప్పుకున్న హిమాలయాల ఒడిలో ఈ ప్రేమజంట విశాల్ చంద్రశేఖర్ అందించిన బాణీకి ఫుల్ గా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళి మరీ నటించినట్టున్నారు.

అలాంటి బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ వెనక్కు అలా వాలి నిలబడితే సాయి పల్లవి మాత్రం మల్లెతీగలా శర్వానంద్ ను అల్లుకుంది. ఇద్దరిమధ్య కెమిస్ట్రీ మాత్రం భీభత్సంగా ఉంది.  మన యూత్ కి హిమాలయాల్లో రొమాన్స్ ఎలా అనే సందేశం గట్టిగానే ఇస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాను డిసెంబర్ 21 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags:    

Similar News