ముంబైకి వీడ్కోలు పలికిన సుశాంత్ హీరోయిన్.. అందుకేనట!

Update: 2020-07-02 14:06 GMT
బాలీవుడ్ యువ సినీహీరో సుశాంత్ సింగ్ రాజపుత్ గత నెల 14న తన ఇంట్లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. డిప్రెషన్ కి లోనై సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం సినీ ఇండస్ట్రీలలో కలకాలం రేపింది. కేసును విచారించిన ముంబై పోలీసులు కూడా సుశాంత్ తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇది హత్య కాదని నిర్ధారించారు. సుశాంత్ మరణాన్ని ఇండస్ట్రీలో.. ఇండస్ట్రీ బయట ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేస్తుంది. సుశాంత్ మృతి పట్ల అతనితో పనిచేసిన సహనటులు.. హీరోయిన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' హీరోయిన్ సంజనా సాంఘి తీవ్ర బావోద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో... "బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను.

వీధులన్ని చాలా కొత్త‌గా, వింత‌గా క‌నిపిస్తున్నాయి. బ‌హుశా నా గుండెల్లోని బాధ వ‌ల‌న చూపు అలా మారిందేమో! త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు" అంటూ త‌న పోస్ట్‌లో పేర్కొంది. ఇక సుశాంత్ ఆత్మహత్య తరువాత పోలీసులు ఆమెను ఏడూ గంటల పాటుగా విచారించిన సంగతి తెలిసిందే. ఇక సంజన సంఘి బాలనటిగా రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ సినిమాలో నటించింది. సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. ముఖేశ్ చాబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Tags:    

Similar News