సంపత్ నంది తర్వాత అతడితోనా..?

Update: 2016-05-06 04:26 GMT
‘గబ్బర్ సింగ్-2’ కోసమని రెండేళ్లు కష్టపడ్డాడు సంపత్ నంది. చివరికి పవన్ కళ్యాణ్ హ్యాండిచ్చేయడంతో ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి ఇబ్బందికర పరిస్థితుల్లో బయటికి వచ్చేయాల్సి వచ్చింది. ఐతే నైరాశ్యంలో కూరుకుపోకుండా వెంటనే ‘బెంగాల్ టైగర్’ మొదలుపెట్టి.. చకచకా పూర్తి చేసేశాడు సంపత్. దర్శకుడిగా తొలి సినిమా కంటే.. ‘బెంగాల్ టైగర్’కే పెద్ద పరీక్ష ఎదుర్కొన్నాడు సంపత్. ఆ పరీక్షలో మంచి మార్కులే వేయించుకున్నాడు. తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సక్సెస్ ఫుల్ సినిమాను అందించాడు. ఐతే ఈ రిజల్ట్ అతడికి వెంటనే పెద్ద అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశించారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ‘బెంగాల్ టైగర్’ విడుదలైన ఆరు నెలలవుతున్నా ఇప్పటిదాకా సంపత్ తర్వాతి ప్రాజెక్టు ఖరారవ్వలేదు.

‘బెంగాల్ టైగర్’లో పవర్ స్టార్ భజన చూస్తే మళ్లీ ఆయనే పిలిచి ఛాన్సిస్తాడని సంపత్ ఆశించినట్లు కనిపించింది. కానీ పవన్ కు అలాంటి ఉద్దేశాలేమీ ఉన్నట్లు కనిపించలేదు. తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ చెర్రీ ‘తనీ ఒరువన్’ రీమేక్ కే ఓటు వేశాడు. మళ్లీ రవితేజతో చేద్దామని చూశాడు కానీ.. అతను కూడా ఖాళీ లేదు. దీంతో చివరికిప్పుడు సంపత్ నంది దృష్టి నితిన్ మీద పడ్డట్లు సమాచారం.

‘అ..ఆ’ తర్వాత ‘గుండె జారి గల్లయింతే’ దర్శకుడు విజయ్ కుమార్ కొండాతో ఓ సినిమా కమిటయ్యాడు నితిన్. అది కాకుండా ఇంకే కమిట్మెంట్లు లేవు. ఈ ఏడాది చివరికి ఈ సినిమా నుంచి బయటికి వచ్చేస్తాడు. తర్వాత సంపత్ తో సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే సంపత్ చెప్పిన లైన్ ఓకే చేశాడట. ఇక తీరిగ్గా స్క్రిప్టు రెడీ చేసుకునే పనిలో ఉండబోతున్నాడు సంపత్.
Tags:    

Similar News