రెజీనా 'మెగా' రూమర్లకు తెరపడ్డట్లే

Update: 2016-04-30 15:30 GMT
వరుసపెట్టి రెండు సినిమాల్లో కలసి నటించారు మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ అండ్‌ డస్కీ బ్యూటి రెజీనా. అయితే అప్పటి నుండి ఈ ఇద్దరూ కలసి డేటింగ్‌ చేస్తున్నారని వార్తలు షికార్లు చేయడం మొదలెట్టాయి. పైగా తన దగ్గరకు వచ్చిన ప్రతీ సినిమా కోసం రెజీనాను హీరోయిన్‌ గా తీసుకుందాం అని సాయిధరమ్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు టాకొచ్చింది.

కట్‌ చేస్తే.. ఈ కథలకు ఫుల్ స్టాప్‌ పెట్టాలను అనుకున్నాడేమో కాని.. సాయిధరమ్‌ మాత్రం తన హీరోయిన్ల ఎంపికలో ఇప్పుడు ఆచితూచి స్టెప్పులు వేస్తున్నాడు. సాయిధరమ్‌ తేజ్‌ వరుసగా రెజీనాకు ఛాన్సులు ఇస్తున్నాడు అని రూమర్లు వెల్లువిరిసిన వేళ.. సుప్రీమ్‌ లో రాశి ఖన్నా.. తిక్క కోసం ఫారిన్‌ అమ్మాయి లరిస్సా బొనేసి లైన్‌ లోకి దిగారు. ఇప్పుడు గోపిచంద్‌ మలినేని డైరక్షన్‌ లో రూపొందుతున్న సినిమా కోసం.. రకుల్‌ ప్రీత్‌ తో రొమాన్స్‌ చేస్తున్నాడు మేనల్లుడు. చూస్తుంటే మనోడు రూమర్లకు బ్రేకిచ్చినట్లే అని చెప్పుకోవాలి మరి.

అయితే రెజీనా కు మాత్రం.. ఇప్పుడు చేతిలో నాగ శౌర్య అండ్‌ నారా రోహిత్‌ సినిమా 'జో అచ్యుతానంద' తప్పిస్తే మరోటి లేదు. తెలుగులో ఆఫర్లు నిల్‌. మెగా క్యాంపులో కూడా ఎవ్వరూ ఛాన్సిచ్చేలా లేరు. అదంతా మరి సాయిధరమ్‌ తో లింకప్‌ రూమర్ల వల్లేనా అనేది మాత్రం తెలియదు గయ్స్. ఇప్పుడు రూమర్లకు తెరపడింది కాబట్టి.. మరి ఆఫర్ల వర్షం కురుస్తుందేమో చూద్దాం.
Tags:    

Similar News