ఉగాది నుంచి మెగా హీరో షురూ

Update: 2017-03-24 04:50 GMT
సాయి ధరం తేజ్ గత రెండు సినిమాలు నిరుత్సాహపరిచాయి. గతేడాది మధ్యలో వచ్చిన తిక్కతో సుప్రీం హీరో వరుస హిట్స్ కి బ్రేక్ పడగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన విన్నర్ చిత్రంతో మరో పరాజయాన్ని మూట కట్టుకున్నాడు. టైటిల్ లో విన్నర్ ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం విన్నర్ గా నిలవలేక పోయిందీ సినిమా.

ఇప్పుడు తన కొత్త సినిమాను మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడీ మెగా హీరో. బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటించనున్న తేజు.. ఆ సినిమా ప్రారంభానికి ఉగాది పండగను ముహూర్తంగా ఖాయం చేశాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు పూజా కార్యక్రమాలు జరగగా.. మార్చ్ 29 నుంచి జవాన్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న యూనిట్.. పండుగ రోజు నుంచి ప్రారంభం కానున్న షెడ్యూల్ లో.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేయనున్నారు.

మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ గా నటిస్తుండగా.. దేశభక్తి కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. జవాన్ క ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనుండగా.. అరుణాచల్ క్రియేషన్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి నిర్మాతగా కృష్ణ వ్యవహరించనున్నారు. ఈ సబ్జెక్ట్ పై ఆసక్తి చెందిన దర్శకుడు హరీష్ శంకర్.. తేజు సినిమాని సమర్పిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News