ఆ సినిమా తర్వాతే అని తేల్చి చెప్పిన మెగా హీరో?

Update: 2020-06-05 07:00 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొంతకాలం వరస ఫ్లాపులతో సతమతమైన తర్వాత 'చిత్రలహరి' సినిమాతో కాస్త రిలీఫ్ దక్కింది.  ఆ సినిమా తర్వాత 'ప్రతి రోజూ పండగే' మంచి విజయం సాధించడంతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తున్నాడు.  త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.  ఇదిలా ఉంటే మరొకటి దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి కూడా తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.  దేవ కట్టా కెరీర్ లో బాక్స్ ఆఫీస్ విజయాలు లేకపోవడంతో ట్రేడ్ వర్గాలలో మొదటి నుంచి ఈ ప్రాజెక్టు విషయంలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ లేవు.  దీంతో ఈ సినిమాను 'సోలో బ్రతుకే సో బెటర్' ఫలితం చూసిన తర్వాతే మొదలుపెట్టాలని దేవ కట్టాకు తేజు స్పష్టం చేశాడని టాక్ వినిపిస్తోంది.  కెరీర్ కు కీలకమైన దశలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నాడట.

నిజానికి తేజు ఇప్పుడిప్పుడే హిట్ ట్రాక్ లోకి వస్తునాడు. ఇలాగే ఒకటి రెండు వరస హిట్లు పడితే తేజు స్టార్ హీరో రేంజికి వెళ్లగలడు. అందుకే సాయి తేజ్ ఇలాంటి కథ ఒప్పుకోవడం రిస్క్ అని టాలీవుడ్ లో కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.  ఏదేమైనా 'సోలో బ్రతుకే సో బెటర్' ఫలితం తేలిన తర్వాతే దేవ కట్టా సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుందట.
Tags:    

Similar News