రేణు దేశాయ్ నిశ్చితార్థం.. వైరల్ ఫొటో

Update: 2018-06-24 11:11 GMT
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సిని నటి రేణుదేశాయ్ తాజాగా విడుదల చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి చూచాయగా చెప్పిన రేణు తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తెలిపింది. ఈ మేరకు తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోను పోస్టు చేసింది. ఈ ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలు మాత్రం పోస్టులో పేర్కొనలేదు.

తాను ఒంటరిగా ఉంటున్నానని పిల్లలను చూసుకోవడానికి ఓ తోడు అవసరం అని పేర్కొన్న రేణు దేశాయ్ కొద్దిరోజులుగా తనకు తోడు కోసం వెతుకుతోంది.  ఇటీవలే ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫొటోను షేర్ చేసి ఓ మంచి కవితను రాని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్ మెంట్ అయినట్టు ఫొటోలను బయటపెట్టి సంచలనం సృష్టించింది.

పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు దేశాయ్ ప్రస్తుతం ఫుణెలో పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి ఉంటోంది. ఇటీవలే తండ్రి పవన్ ఆపరేషన్ కోసం అకీరా విజయవాడకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందనే విషయాన్ని బయటపెట్టడం సంచలనమైంది. ఈ సందర్భంగా తన రెండో వివాహం విషయంలో సపోర్ట్ చేసిన వారందరికీ రేణు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు  తెలిపింది.
Tags:    

Similar News