మరో మూవీకి మాస్ మహరాజ్ ఓకే

Update: 2017-03-25 09:26 GMT
ప్రస్తుతం రవితేజ రెండు సినిమాల షూటింగ్ ఒకే సారి చేసేస్తున్నాడు. టచ్ చేసి చూడు.. రాజా ది గ్రేట్ లు నిర్మాణంలో ఉండగా.. వీటితో పాటు ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతేడాది తమిళంలో సూపర్ హిట్ సాధించిన బోగన్ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నాడు రవితేజ.

జయం రవి.. అరవింద్ స్వామిలు నటించిన బోగన్ మూవీ.. 2016 తమిళ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దర్శకుడు లక్షణ్ ఈ మూవీని తెలుగులో కూడా తీయాలని భావించి.. తెలుగు వెర్షన్ లో జయం రవి పాత్ర కోసం రవితేజను అప్రోచ్ అయ్యాడు. కాన్సెప్ట్ గురించి ముందే తెలిసిన మాస్ మహరాజ్.. దర్శకుడి మేకింగ్ స్టైల్ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇప్పటికే తెలుగు వెర్షన్ కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా లాక్ చేసేసుకున్నారని తెలుస్తోంది. ఆగస్ట్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నాడు రవితేజ.

ఇక అరవింద్ స్వామి పాత్రను ఎవరితో చేయిస్తారనే ప్రశ్న సహజం. రీమేక్ లో అరవింద్ స్వామికి బదులుగా.. మరో సూటబుల్ నటుడిని ఇప్పటికే నిర్ణయించారట. ఒక వారం రోజుల్లో ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. ఇతర నటీనటుల వివరాలను కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News