అజయ్ భూపతి 'మహా సముద్రం'లో హీరోలు వారేనా...?

Update: 2020-05-28 10:50 GMT
టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్‌ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్‌ భూపతి. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్‌ భూపతి 'Rx 100' సినిమాతో తన మార్క్‌ చూపించాడు. అయితే ఫస్ట్ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ సాధించినా అజయ్ భూపతి రెండో సినిమా మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లే ప్లాన్‌ లో ఉన్నారు. దీనికోసం 'మహా సముద్రం' అనే కథను సిద్ధం చేసుకున్న అజయ్‌.. ఆ కథ కోసం హీరో ఎవరు అనే సస్పెన్స్ చాలా రోజులు కొనసాగుతోంది. 'మహా సముద్రం' సినిమా కోసం అజయ్‌ ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికీ స్టోరీ వినిపించాడట. వారిలో రవితేజ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని న్యూస్ కూడా వచ్చింది. కానీ ఆ వార్తలు నిజం కాలేదు.

ఆ తర్వాత మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక హీరో శర్వానంద్ అని.. మరో హీరో బొమ్మరిల్లు సిద్దార్థ అని వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంభందించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే ఇప్పుడు అజయ్‌ భూపతి ఈ మూవీలో హీరోగా రామ్ పోతినేనిని అనుకుంటున్నాడని న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ మధ్య మాస్ సినిమాలతో అదరగొడుతున్న రామ్ అయితే 'మహా సముద్రం'లో సెట్ అవుతాడని డైరెక్టర్ భావిస్తున్నాడట. అంతేకాకుండా మరో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే దుల్కర్ కి స్టోరీ కూడా వినిపించాడట. వీరితో పాటు ఈ ప్రాజెక్ట్ లో ఒక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొనివున్న పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Tags:    

Similar News