హిమక్రీములు అమ్ముకుంటున్న రామ్ చరణ్

Update: 2018-04-26 12:32 GMT
ఐస్ క్రీమ్స్ అనే పదానికి తెలుగులో హిమ క్రీములు అంటూ అర్ధం చెప్పారు యమలీల మేకర్స్. అప్పట్లో అదో సెన్సేషన్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. రంగస్థలంతో గ్రాండ్ సక్సెస్ సాధించి.. నాన్ బాహుబలి రికార్డులన్నీ ఖాతాలో వేసేసుకుని.. ఇంకా వసూళ్లతో సత్తా చాటుతున్న రామ్ చరణ్.. సడెన్ గా హైద్రాబాద్ రోడ్లపై ఐస్ క్రీములు అమ్మేసుకుంటున్నాడు.

మెగాస్టార్ తనయుడు ఇలా చేస్తున్నాడంటే కచ్చితంగా వెనుక ఏదో ఒక రీజన్ ఉందని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ అసలు విషయం కూడా అదే. మేము సైతం అంటూ మంచు లక్ష్మి.. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ టీవీ షో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆపన్నులను ఆదుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు చెర్రీ అంగీకరించాడంటూ.. కొన్ని వారాల క్రితమే మాటలు వచ్చాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కు సంబంధించిన ఎపిసోడ్ కు షూటింగ్ చేస్తున్నారు.

హైద్రాబాద్ రోడ్లపై ఐస్ క్రీములు.. పుదీనా వాటర్ ను అమ్ముతూ సొమ్ములు రాబడుతున్నాడు రామ్ చరణ్. ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలు తామే ఆ సాయం చేయగలరు కానీ.. ఈ మంచి పనిలో సామాన్యులను కూడా భాగం చేయడం ద్వారా.. వారిలోనూ.. తద్వారా కార్యక్రమాన్ని చూసినవారిలోను మానవత్వాన్ని తట్టి లేపాలన్నదే మేము సైతం థీమ్. ఇందుకోసం హైద్రాబాద్ రోడ్లపై ఎండలను లెక్క చేయకుండా ఐస్ క్రీములు అమ్మేస్తున్నాడు చెర్రీ. మరి రామ్ చరణ్ కలెక్షన్ ఎంతొచ్చిందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.
Tags:    

Similar News