మేము సైతం అంటున్న రాంచరణ్

Update: 2018-03-20 05:09 GMT
తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో అనేక కార్యక్రమాలు వస్తుంటాయి. గేమ్ షోలు.. రియాల్టీ షోలలో మన స్టార్లు తెగ పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ వీటన్నిటిలోకి విభిన్నమైన కార్యక్రమంగా మేము సైతం గుర్తింపు సంపాదించుకుంది. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అనేకమంది సెలబ్రిటీలు.. స్టార్లు.. తమ వంతుగా ఆపన్నులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటి వరకూ పలువురు స్టార్స్ మేము సైతం కార్యక్రమానికి అటెండ్ అయ్యి.. విభిన్న కార్యకలాపాల ద్వారా నిధులు  సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించారు. అయితే.. ఒక్క సాయిధరం తేజ్ మినహాయిస్తే.. ఇప్పటివరకూ మరే మెగా హీరో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ లోటు తీరిపోనుంది. రామ్  చరణ్ కూడా మేము సైతం అంటున్నాడు. గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజ్ లో రామ్ చరణ్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది.

అయితే.. ఇప్పటివరకూ అనేక మంది హీరోలతో పలు రకాల పనులు చేయించిన మంచు లక్ష్మి.. రాంచరణ్ కు ఎలాంటి పనులు అప్పగించనుందో అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చరణ్ లాంటి  సున్నిత మనస్కుడితో మేము సైతం కార్యక్రమం నిర్వహించనున్నారనే వార్తలు.. ఇండస్ట్రీ జనాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.


Tags:    

Similar News