అవార్డ్ ఫంక్షన్ లో చెర్రీ చిందేస్తున్నాడు

Update: 2015-11-23 06:52 GMT
బడా ఫంక్షన్ లలో స్టార్ హీరోలు డ్యాన్సులు చేసి అలరిస్తూ ఉంటారు. మన టాలీవుడ్ వరకు అయితే.. స్టార్ హీరోలు ఆన్ స్టేజ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం చాలా తక్కువ. కానీ ఆ ట్రెండ్ ని మెగా టీం బద్దలు కొట్టేస్తోంది. ఇప్పటికే ఐఐఎఫ్ ఏ ఉత్సవం అవార్డ్ ఫంక్షన్ కి హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ.. అల్లు శిరీష్ ఓ రికార్డ్ సృష్టించనున్నాడు.

ఇప్పుడీ ఫంక్షన్ కి అంతకంటే జోష్ ఇచ్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. చెర్రీ ఏకంగా స్టేజ్ పై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనుండడం హైలైట్. రామ్ చరణ్ తొలిసారిగా ఓ ఫంక్షన్ లో స్టేజ్ పై డ్యాన్సులు వేయనున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ లు కూడా ప్రారంభించేశాడు ఈ మెగా హీరో. షైమక్ డ్యాన్స్ అకాడమీతో కలిసి చరణ్ స్టెప్స్ వేయనుండడం విశేషం. ఈవెంట్ కొరియోగ్రఫీ ఈ అకాడమీకి మంచి పేరే ఉంది. తండ్రి మెగాస్టార్ కి సంబంధించిన సూపర్ హిట్ సాంగ్స్ కు చరణ్ డ్యాన్స్ చేయనున్నాడు. అంతే కాదు.. తమ మూవీస్ లోని కొన్ని బిట్స్ ని కూడా పెర్ఫామ్ చేయనున్నాడట. ఇక్కడితో ఆగిపోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ - సాయిధరం తేజ్ - వరుణ్ తేజ్ పాటలకు చెర్రీ చిందులు చూడచ్చని తెలుస్తోంది.

ఇలా రామ్ చరణ్.. మిగిలిన అందరి మెగా హీరోల పాటలకు డ్యాన్స్ చేసే స్కిట్.. ఈ ఈవెంట్ కే  హైలైట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ గా తనిఒరువన్ రీమేక్ కి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్ కాగా.. అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Tags:    

Similar News