సెల్ఫీ స్టోరి: మెగా కపుల్ అదిరే

Update: 2017-05-27 06:05 GMT
సెల్ఫీలు తీసుకోవడం అనేది ఒక ట్రెండ్. అయితే ఆ సెల్ఫీను ఎక్కడ తీసుకున్నారు అనే దానిబట్టి ఆ సెల్ఫీకి విపరీతమైన క్రేజ్ వస్తుంటుంది. ఆస్కార్ అవార్డుల్లో ఒసారి వ్యాఖ్యాత ఎలెన్ డీజెనరెస్ ప్రముఖ హాలీవుడ్ హీరోలు హీరోయిన్లతో ఒక సెల్ఫీ దిగింది. అది వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న సెల్ఫీ కూడా.. మెగా ఫ్యాన్స్ అలాగే వైరల్ అవుతోంది.

గోదావరి జిల్లాలో మండుటెండల్లో సుకుమార్ సినిమా కోసం షూటింగ్ చేసిన రామ్ చరణ్‌.. ఇప్పుడు భార్యతో కలసి ఒక మంచు కొండల ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడే వర్కవుట్ పేరుతో భార్యతో కలసి ఏకంగా 7 గంటల పాటు కొండలను ఎక్కేసి (ట్రెక్కింగ్) అలా మంచు పర్వత శిఖరానికి చేరుకున్నారట. చాలా క్యాలరీలు కరిగించేశాం అంటూ ఉపాసన ఈ సెల్ఫీ షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

ఇకపోతే మే 11న లండన్ వెళ్లిన ఉపాసన.. అక్కడ చరణ్‌ తో కలసి జాగింగ్ చేస్తూ కనిపించింది. అంటే వీరు అవరోహించిన ఈ పర్వత శ్రేణి స్విట్జర్ ల్యాండ్ అయ్యుంటుందా? లండన్ నుండి అలా యురోప్ చెక్కేశారా? ఏమో మెగా కపుల్ చెబితేకాని మనకు లొకేషన్ తెలిసే ఛాన్సు లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News