హైదరాబాద్​కు వచ్చేసిన రకుల్​.. డ్రగ్స్​ కథ ముగిసినట్టేనా?

Update: 2020-10-21 02:50 GMT
తెలుగు తెరమీద కొంత కాలం పాటు స్టార్​ హీరోయిన్​ హోదాను ఎంజాయ్​ చేసిన రకుల్​ ప్రీత్​ సింగ్​ డ్రగ్స్​ కేసులో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడింది. ఆమె స్నేహితురాలు రియా చక్రవర్తి డ్రగ్స్​ కేసులో అరెస్ట్​ కావడంతో రకుల్​కు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం లో నెల రోజుల పాటు రకుల్​ ముంబైలోనే ఉండిపోయింది. గత నెల 25న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఎదుట హాజరైంది. డ్రగ్స్​ కేసు రాకముందే ఆమె పలు సినిమాలకు ఒప్పుకున్నది. ఇందులో భాగంగా వైష్టవ్​ తేజ్​తో ఓ సినిమాను చేస్తోంది. ఈ చిత్రం వికారాబాద్​ లో షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే షూటింగ్​ లో ఉండగానే ఆమెకు డ్రగ్స్​ కేసులో నోటీసులు అందడం తో ముంబై వెళ్లి పోయింది.

అయితే సోమవారం హైదరాబాద్​కు చేరుకున్న రకుల్​.. రెగ్యులర్​ షూటింగ్​లో పాల్గొంటోంది.  వికారాబాద్ ఫారెస్ట్‌లో ఒక కీలకమైన సన్నివేశంలో  రకుల్​ నటించింది. ఈ షెడ్యూల్‌లో తన భాగాలను పూర్తి చేసిన తర్వాత, ఆమె నితిన్ ‘చెక్’ లో నటించనున్నది. పూర్తయ్యే వరకు ఈ చిత్రం కోసం నాన్‌స్టాప్ షూట్ చేస్తుంది. ఈ రెండు చిత్రాలతో ఆమె కొంత కాలం పాటు హైదరాబాద్ లోనే బిజీగా ఉంటుంది. రకుల్ వైష్ణవ్ తేజ్ చిత్రంలో పల్లెటూరి పిల్లగా కనిపించనుండగా, చంద్రశేఖర్ ఏలేటి చెక్ చిత్రంలో లాయర్ పాత్రలో నటించనుంది. డ్రగ్స్ కేసులో  ఆమె పేరు రావడానికి ముందే ఈ ప్రాజెక్టులకు ఆమె సంతకం చేసింది. తెలుగులో రెండు సినిమాలు కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో  రెండు చొప్పున  సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
Tags:    

Similar News