మనవడి కోసం సూపర్‌ స్టార్‌ రహస్య ప్రయాణం

Update: 2018-10-22 10:52 GMT
ఎంత పెద్ద స్టార్‌ అయిన కూతురుకు తండ్రే - భార్యకు భర్తే - మనవడికి తాతే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తానో స్టార్‌ అయినా కూడా రజినీకాంత్‌ తన మనవడి కోరికను తీర్చేందుకు ఆటోలో ప్రయాణించాడు. చాలా ఏళ్ల క్రితం ‘భాష’ చిత్రంలో ఆటో డ్రైవర్‌ గా కనిపించిన రజినీకాంత్‌ మళ్లీ అప్పటి నుండి ఆటోతో కనిపించలేదు. అప్పటి నుండి ఆయన ఆటో వద్దకు వెళ్లాడో లేదో కూడా తెలియదు. మళ్లీ ఇప్పుడు తన మనవడు వేద్‌ కోరిక మేరకు తన ఇంటి నుండి చిన్నకూతురు ఐశ్వర్య ఇంటి వరకు రహస్యంగా ఆటోలో ప్రయాణించాడు.

ఇంట్లో లెక్కకు మించి కార్లు ఉన్నా కూడా ప్రతి రోజులా కాకుండా ఆటోలో ప్రయాణించాలనే కోరిక వేద్‌ కు కలగడం, అందుకు తాతగా తన బాధ్యతను నెరవేర్చి, మనవడి కోరికను తీర్చడం జరిగింది. పోయేస్‌ గార్డెన్‌ లోని తన ఇంటికి ఆటోను పిలిపించుకుని - అక్కడ నుండి కూతురు ఐశ్వర్య ఉండే ఆళ్వార్‌ పేటకు రజినీకాంత్‌ ఆటోలోనే వెళ్లాడు. ఈ సందర్బంగా ఎవరు కూడా చూడకుండా - ఈ విషయం బయటకు పొక్క కుండా జాగ్రత్త పడ్డారు. అయితే రజినీకాంత్‌ ఆటోలో ప్రయాణించాడంటూ తమిళనాట వార్త లీక్‌ అయ్యింది. అది కాస్త ఇలా వైరల్‌ అయ్యింది.

ఇటీవలే లక్నో నుండి ‘పేట’ చిత్రీకరణ ముగించుకుని చెన్నై చేరుకున్న రజినీకాంత్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘2.ఓ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ‘పేట’ చిత్రం విడుదల కాబోతుంది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో త్రిష హీరోయిన్‌ గా నటిస్తున్న పేట చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరో వైపు రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
Tags:    

Similar News