రాజమౌళి ఆ జోనర్ ఎంచుకున్నాడా?

Update: 2017-12-11 04:49 GMT
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్త సినిమా ప్రకటన కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా జక్కన్న కొత్త సినిమాపై ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఎన్టీఆర్.. రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి నెక్ట్స్ మూవీ ఉంటుందనే టాక్ ఫుల్లుగానే ఉంది కానీ.. ఇప్పటివరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.

ఇప్పుడీ ప్రాజెక్టు గురించిన కొత్త సంగతులు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించేలా షెడ్యూల్స్ ఫైనల్ అయ్యాయట. మొదటగా ఎన్టీఆర్ పై సీన్స్ ను పూర్తి చేసి.. ఆ తర్వాత రామ్ చరణ్ సీన్స్ ను పిక్చరైజ్ చేస్తాడట రాజమౌళి. చివరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఉండే సీన్స్ ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అయితే.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ కోసం రాజమౌళి ఎంచుకున్న జోనర్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకూ కమర్షియల్.. ఫ్యాంటసీ సినిమాలపై ఫోకస్ చేసిన జక్కన్న.. ఇప్పుడు చెర్రీ-ఎన్టీఆర్ లతో ఓ ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాడని అంటున్నారు.

అది కూడా ఓ రియల్ లైఫ్ ఫ్యామిలీ నుంచి ఇన్ స్పైర్ అయిన కథ అనే మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆ ఫ్యామిలీ ఏదనే సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు కానీ.. ఓ కుటంబం రాజమౌళిని బాగా ఇన్ స్పైర్ చేసిందని.. తనకు తెలిసిన సంఘటనల చుట్టూనే ఆ కథ రాసుకున్నాడని అంటున్నారు.


Tags:    

Similar News