డెంట‌ల్ డాక్ట‌ర్ శ‌ర్మాజీ పాల‌నురుగు సౌంద‌ర్యం

స్టన్నింగ్ అప్పియ‌రెన్స్ తో మైండ్ బ్లాక్ చేయ‌డం ఎలానో సౌంద‌ర్య శ‌ర్మనే అడ‌గాలి. ర‌క్తాంచ‌ల్ వెబ్ సిరీస్ తో ఈ భామ పేరు మార్మోగింది

Update: 2024-05-05 19:04 GMT

స్టన్నింగ్ అప్పియ‌రెన్స్ తో మైండ్ బ్లాక్ చేయ‌డం ఎలానో సౌంద‌ర్య శ‌ర్మనే అడ‌గాలి. ర‌క్తాంచ‌ల్ వెబ్ సిరీస్ తో ఈ భామ పేరు మార్మోగింది. ర‌క్తాంచ‌ల్ పార్ట్ 1, 2 లో ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు యువ‌త‌రం బాగా క‌నెక్ట‌యిపోయారు. వ‌రుస‌గా బోల్డ్ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొట్టే ఈ బ్యూటీ ఇటీవ‌ల బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా మారింది. తాజాగా సౌంద‌ర్య షేర్ చేసిన మ‌రో హాట్ ఫోటోషూట్ వెబ్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో సౌంద‌ర్య పాల‌నురుగు దేహ‌శిరులు స్పెష‌ల్ ట్రీట్ గా మారాయి.

బ్యూటీ విత్ మైండ్ అంటే సౌంద‌ర్య శ‌ర్మ అనే విష‌యం తెలిసింది కొద్దిమందికే. రక్తాంచల్ వెబ్ సిరీస్‌లో హాట్‌నెస్ కంటెంట్ తో క‌ళ్లు చెదిరే ట్రీటిచ్చిన ఈ బ్యూటీ ఒక క్వాలిఫైడ్ డెంటిస్ట్ అనే సంగ‌తి త‌క్కువ మందికి తెలుసు. డాక్ట‌ర్ల కుటుంబం నుంచి వ‌చ్చిన సౌంద‌ర్య మెడిసిన్ పూర్తి చేసింది. సౌందర్య సర్టిఫైడ్ డెంటిస్ట్ .. న‌ట‌న‌లోకి రాక‌ముందు ఢిల్లీలో ప్రాక్టీస్ చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో సౌంద‌ర్య మాట్లాడుతూ-``నేను ఒక సర్టిఫికేట్ డెంటిస్ట్‌ని, ఢిల్లీలో క్లినిక్ కూడా ఉంది. నేను నటిని కావాలనే నా కలల కోసం దానిని వదులుకున్నాను. నేను కొంతకాలం ప్రాక్టీస్ చేశాను.. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసాను`` అని తెలిపింది.

Read more!

న‌టిగా మారడానికి ప్రేరేపించిన అంశం ఏమిటి? అని ప్ర‌శ్నిస్తే... సౌంద‌ర్య‌ ఇలా చెప్పింది, ``నేను చదువులో బాగానే మెరిట్‌తో ఉన్నాను.. మా కుటుంబంలో అందరూ ఉన్న‌త‌విద్యావంతులు. డాక్టర్, ఇంజనీర్, IAS! లు ఉన్నారు. కానీ నేను నటిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఎల్ల‌పుడూ పాటలను చూసి ఆకర్షితురాలిని అయ్యేదానిని. కెమెరా ముందు నటులు ఎలా చేస్తారో చూసి ఆశ్చర్యపోయాను. నేను హాలీవుడ్ చిత్రాలను చూడటం ప్రారంభించాను. చివరికి నటిగా మారాను`` అని తెలిపింది.

సౌందర్య 2017లో బాలీవుడ్ చిత్రం `రాంచీ డైరీస్‌`తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. దీనిని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నిర్మించారు. ఆ త‌ర్వాత ర‌క్తాంచ‌ల్ సిరీస్ తో త‌న పేరు మార్మోగిపోయింది. కంట్రీ మాఫియా, క‌ర్మ యుధ్ అనే సిరీస్ ల‌లోను న‌టించింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీ ఆర్టిస్టుగా కెరీర్ ని సాగిస్తోంది. ప‌లు చిత్రాల‌కు సౌంద‌ర్య సంత‌కాలు చేసింద‌ని స‌మాచారం. వీటిని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని చెబుతోంది.

Tags:    

Similar News