క్రిష్ తో పనేంటి ప్రసాద్ గారు?

Update: 2017-10-20 07:30 GMT
ఈ రోజుల్లో కమర్షియల్ గా సినిమాలను తీసే దర్శకులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమా తీసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక  మానవత్వం విలువలని చూపిస్తూ.. మనసుకు హత్తుకునే సినిమాలను తీసేవారు మన టాలీవుడ్ లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారిలో మొదట గుర్తొచ్చేది క్రిష్ అని చెప్పాలి.

ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నిటిలో ఎదో ఒక సీన్ మంచి తనానికి విలువ ఇవ్వాలనే విధంగా ఉంటుంది. గమ్యం - వేదం సినిమాలే చెబుతాయి క్రిష్ టాలెంట్ ఏంటో. ఒక సినిమా తీస్తే అలా మనసులో ఉండిపోవాలి అనేది ఆయన సిద్ధాంతం. దాన్ని ఒకరి కోసం ఎప్పుడు మార్చుకోలేదు. ప్రస్తుతం కంగాన రనౌత్ తో మణికర్ణిక అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆయనను నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ కలిశారు.

భవ్య క్రియేషన్స్ పై శమంతకమణి - పైసా వసూల్ వంటి డిఫెరెంట్ సినిమాలని ఒకే సారి తెరకెక్కించిన ఆనంద్ ప్రసాద్ సడన్ గా క్రిష్ గారిని కలవడం చూస్తుంటే మరో డిఫరెంట్ సినిమాకి ప్లాన్ చేశారా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. చూడాలి మరి ఎలాంటి సినిమా తీస్తారో..



Tags:    

Similar News