మాస్టర్ బ్లాస్టర్ పక్కనే లేటెస్ట్ సెన్సేషన్

Update: 2018-02-24 10:20 GMT
ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను పర్సనల్ గా కలవడం ఎవరికైనా అఛీవ్మెంట్ అవుతుంది. సామాన్యుల నుంచి సినిమా స్టార్ల వరకూ సచిన్ ను ఆరాధిస్తారు. ప్రస్తుతం పార్లమెంట్ మెంబర్ కూడా అయిన సచిన్ ను కలిసే అవకాశం అందరికీ రాదు. లేటెస్ట్ ఆన్ లైన్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ కు ఇప్పుడు ఏకంగా సచిన్ ను కలిసే అవకాశం వచ్చింది.

కొచ్చిలో ఐఎస్ ఎల్-2018 జరుగుతున్న సందర్భఁగా.. అక్కడకు సచిన్ వచ్చాడు. ఈ కార్యక్రమానికి ప్రియా ప్రకాష్ వారియర్.. తన కో యాక్టర్ అయిన రోషన్ అబ్దుల్ తో కలిసి వచ్చింది. ఈ సమయంలో సచిన్ ను కలిసే అద్భుత అవకాశం ఆమెకు చిక్కింది. అంతే ఆ క్షణంలో దిగిన ఫోటోలను నెట్ లో షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. దేవుడితో కలిసి ఫోటో దిగానంటూ చెప్పుకొచ్చింది. సచిన్ తో గడిపిన క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనివంటూ చెప్పుకొచ్చింది ఈ సెన్సేషనల్ బ్యూటీ.

ఒరు అడార్ లవ్ ప్రచారంలో భాగంగా ఐఎస్ఎల్ జరుగుతున్న నెహ్రూ స్టేడియంకు వచ్చారు టీం. ఇదే సమయంలో అభిషేక్ బచ్చన్ ను కూడా కలుసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ బాలీవుడ్ హీరోతో కూడా దిగిన ఫోటోను.. వీడియోను నెట్ లో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం దక్కిన అద్భుతమైన రోజును ఎన్నటికీ మరువనని అంటోంది.
Tags:    

Similar News