డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తదుపరి అశ్వనిదత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. 2021 ఎండింగ్ నాటికి ఈ మూవీకి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత డార్లింగ్ కి ఓ రెండు కమిట్ మెంట్లు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సహా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి కమిట్ మెంట్లు ఇచ్చారు.
అయితే ఈలోగానే ప్రభాస్ బాలీవుడ్ కి వెళ్లిపోతున్నారని ప్రచారమవుతోంది. తానాజీ ఫేం ఓం రౌత్ తెరకెక్కించనున్న భారీ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ నటిస్తున్నారని.. ఇందులో ఓ కీలక పాత్రలో హృతిక్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారమవుతోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ అందునా పాన్ ఇండియా కేటగిరీ అంటే దానికి చాలా ఎక్కువ సమయమే తీసుకుంటుంది. క్రిష్ 3 కోసమే ఏకంగా మూడేళ్లు పట్టింది. ఇప్పుడు ఆ రేంజులోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. అలాంటప్పుడు ప్రభాస్ అన్ని రోజుల కాల్షీట్లు బాలీవుడ్ సినిమా కోసం కేటాయిస్తే ఇక్కడ నిర్మాతల పరిస్థితేమిటి? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అంటే ఆ ఇద్దరు నిర్వాతల్ని వెయిటింగులో ఉంచి బాలీవుడ్ కి వెళతాడా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇటు మైత్రి నిర్మాతలు సహా దిల్ రాజు .. ప్రభాస్ కోసం స్క్రిప్టుల్ని లాక్ చేసారా లేదా? దర్శకులను ఫైనల్ చేశారా లేదా? అన్నదానిపైనా సరైన క్లారిటీ లేదు. అందుకే ఇప్పుడు ప్రభాస్ హిందీ పరిశ్రమ నుంచి వచ్చిన ఆఫర్ ని కాదనలేదని భావిస్తున్నారు. బాహుబలి 1.. బాహుబలి 2.. సాహో చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రభాస్ మరోసారి హిందీ చలనచిత్రపరిశ్రమలో సత్తా చాటుతాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అక్కడ క్రేజు సన్నగిల్లక ముందే ఓం రౌత్ ప్రాజెక్టుతో ముందుకెళితేనే సరైన నిర్ణయం తీసుకున్నట్టు అని విశ్లేషిస్తున్నారు.
అయితే ఈలోగానే ప్రభాస్ బాలీవుడ్ కి వెళ్లిపోతున్నారని ప్రచారమవుతోంది. తానాజీ ఫేం ఓం రౌత్ తెరకెక్కించనున్న భారీ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ నటిస్తున్నారని.. ఇందులో ఓ కీలక పాత్రలో హృతిక్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారమవుతోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ అందునా పాన్ ఇండియా కేటగిరీ అంటే దానికి చాలా ఎక్కువ సమయమే తీసుకుంటుంది. క్రిష్ 3 కోసమే ఏకంగా మూడేళ్లు పట్టింది. ఇప్పుడు ఆ రేంజులోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. అలాంటప్పుడు ప్రభాస్ అన్ని రోజుల కాల్షీట్లు బాలీవుడ్ సినిమా కోసం కేటాయిస్తే ఇక్కడ నిర్మాతల పరిస్థితేమిటి? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అంటే ఆ ఇద్దరు నిర్వాతల్ని వెయిటింగులో ఉంచి బాలీవుడ్ కి వెళతాడా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇటు మైత్రి నిర్మాతలు సహా దిల్ రాజు .. ప్రభాస్ కోసం స్క్రిప్టుల్ని లాక్ చేసారా లేదా? దర్శకులను ఫైనల్ చేశారా లేదా? అన్నదానిపైనా సరైన క్లారిటీ లేదు. అందుకే ఇప్పుడు ప్రభాస్ హిందీ పరిశ్రమ నుంచి వచ్చిన ఆఫర్ ని కాదనలేదని భావిస్తున్నారు. బాహుబలి 1.. బాహుబలి 2.. సాహో చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రభాస్ మరోసారి హిందీ చలనచిత్రపరిశ్రమలో సత్తా చాటుతాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అక్కడ క్రేజు సన్నగిల్లక ముందే ఓం రౌత్ ప్రాజెక్టుతో ముందుకెళితేనే సరైన నిర్ణయం తీసుకున్నట్టు అని విశ్లేషిస్తున్నారు.