పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాహో డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో భారీ భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'OG' రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. సురేశ్బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్రాజు, అరవింద్ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అనుమానం కొంతమంది మెదడులో మెదులుతోంది. అదేంటంటే ఈ సినిమాకు అసలైన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అల్లు అరవింద్ అని అంటున్నారు.
ఎందుకంటే నిన్న గ్రాండ్గా జరిగిన ఈవెంట్లో పవన్తో పాటు అల్లు అరవింద్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు. ఈ చిత్రాన్ని డీవీవీ నిర్మిస్తున్నప్పటికీ.. ఈ చిత్రంలో అరవింద్ కూడా భాగస్వామ్యమయ్యారని సమాచారం అందుతోంది. ఆయన వెనక నుంచి సైలైంట్గా ఫైనాన్స్ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు స్డూడియోస్లో చిత్రీకరించనున్నారట. ఇక సినిమా రిలీజ్ విషయాలకు సంబంధించిన పనులు కూడా చూసుకోబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ప్రస్తుతం ఈ ప్రచారం ఊపందుకుంది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేశాడు. పైగా అతడు పవన్కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ అందుకున్న తర్వాత డీవీవీ..
ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఇటు యాక్షన్ ప్రియులకు, అటు పవన్ అభిమానులకు ఇది పండుగలాంటి చిత్రమ"ని నిర్మాత దానయ్య ప్రకటించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు. అయితే ఈ సినిమా పంజా, సాహా లాంటి అవుట్ పుట్ కాకుండా కేజీయఫ్, పఠాన్ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇకపోతే నిన్న అన్నపూర్ణ స్టూడీయోస్లో గ్రాండ్గా జరిగిన ఈ మూవీ లాంచ్ ఈవెంట్లో పవన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫొటోస్ కూడా సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్ ఈజ్ బ్యాక్, యంగ్ లుక్లో కనిపిస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఎందుకంటే నిన్న గ్రాండ్గా జరిగిన ఈవెంట్లో పవన్తో పాటు అల్లు అరవింద్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు. ఈ చిత్రాన్ని డీవీవీ నిర్మిస్తున్నప్పటికీ.. ఈ చిత్రంలో అరవింద్ కూడా భాగస్వామ్యమయ్యారని సమాచారం అందుతోంది. ఆయన వెనక నుంచి సైలైంట్గా ఫైనాన్స్ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు స్డూడియోస్లో చిత్రీకరించనున్నారట. ఇక సినిమా రిలీజ్ విషయాలకు సంబంధించిన పనులు కూడా చూసుకోబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ప్రస్తుతం ఈ ప్రచారం ఊపందుకుంది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేశాడు. పైగా అతడు పవన్కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ అందుకున్న తర్వాత డీవీవీ..
ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఇటు యాక్షన్ ప్రియులకు, అటు పవన్ అభిమానులకు ఇది పండుగలాంటి చిత్రమ"ని నిర్మాత దానయ్య ప్రకటించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు. అయితే ఈ సినిమా పంజా, సాహా లాంటి అవుట్ పుట్ కాకుండా కేజీయఫ్, పఠాన్ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇకపోతే నిన్న అన్నపూర్ణ స్టూడీయోస్లో గ్రాండ్గా జరిగిన ఈ మూవీ లాంచ్ ఈవెంట్లో పవన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫొటోస్ కూడా సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్ ఈజ్ బ్యాక్, యంగ్ లుక్లో కనిపిస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.