పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ, ఆయన క్రేజ్ నీ... ఇమేజ్ ని బాగా వాడుకుంటోంది శంకరాభరణం టీమ్. మొన్నటికి మొన్న పవన్ బర్త్ డేని పురస్కరించుకొని పవనిజంపై ఓ పాటని తయారు చేసి విడుదల చేశారు. ఆ పాట మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పవనిజం డేని కూడా వాడుకొనేందుకు సిద్ధమైయ్యారు. ఆదివారం వరల్డ్ పవనిజం డే. ఈ సందర్భంగా శంకరాభరణం టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ టీజర్ ని స్వయంగా పవన్ కళ్యాణే విడుదల చేస్తాడని సమాచారం. మరి ఆ వేడుక ఎక్కడ జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏ వేడుకకీ హాజరు కావడం లేదు. తన కుటుంబ కథానాయకుల సినిమాలకి సంబంధించిన ఫంక్షన్ లలో కూడా పాల్గొనలేదు. కానీ శంకరాభరణం నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కి మాత్రం పవన్ మాటిచ్చాడట. అయితే టీజర్ ని ఫంక్షన్ ఏర్పాటు చేసి విడుదల చేయడం కాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో విడుదల చేయొచ్చని ప్రచారం సాగుతోంది.
చిత్రానికి రచయితగా పనిచేస్తూ సమర్పకుడిగా వ్యవహరించిన కోన వెంకట్ తెలివిగా పవన్ క్రేజ్ వాడుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కీ - కోనకీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే పవన్ శంకరాభరణం టీజర్ ని విడుదల చేయడానికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. నిఖిల్ - నందిత జంటగా `శంకరాభరణం` తెరకెక్కుతోంది. ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ కామెడీ కథతో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే గుమ్మడికాయ కూడా కొట్టేశారు. నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం. పవనిజం డేకి టీజర్ ని విడుదల చేయడం మొదలు ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో బాగా డబ్బున్న కోటీశ్వరుడి వారసుడి కథతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏ వేడుకకీ హాజరు కావడం లేదు. తన కుటుంబ కథానాయకుల సినిమాలకి సంబంధించిన ఫంక్షన్ లలో కూడా పాల్గొనలేదు. కానీ శంకరాభరణం నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కి మాత్రం పవన్ మాటిచ్చాడట. అయితే టీజర్ ని ఫంక్షన్ ఏర్పాటు చేసి విడుదల చేయడం కాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో విడుదల చేయొచ్చని ప్రచారం సాగుతోంది.
చిత్రానికి రచయితగా పనిచేస్తూ సమర్పకుడిగా వ్యవహరించిన కోన వెంకట్ తెలివిగా పవన్ క్రేజ్ వాడుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కీ - కోనకీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే పవన్ శంకరాభరణం టీజర్ ని విడుదల చేయడానికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. నిఖిల్ - నందిత జంటగా `శంకరాభరణం` తెరకెక్కుతోంది. ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ కామెడీ కథతో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే గుమ్మడికాయ కూడా కొట్టేశారు. నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం. పవనిజం డేకి టీజర్ ని విడుదల చేయడం మొదలు ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో బాగా డబ్బున్న కోటీశ్వరుడి వారసుడి కథతో ఈ చిత్రం తెరకెక్కింది.