నితిన్ కోసం మళ్లీ పవన్ వస్తున్నాడు

Update: 2018-03-22 13:58 GMT
పవన్ కళ్యాణ్ ను సినిమా ఈవెంట్ లో చూసి చాలా కాలం అయింది. అజ్ఞాతవాసి తర్వాత ఇప్పటివరకూ పవన్ నోటి నుంచి ఓ సినిమా గురించిన మాట వచ్చిందే లేదు. తను సినిమాలు చేయడమే కాదు.. వాటి గురించి మాట్లాడడం కూడా మానేసి.. అభిమానులను తెగ డిజప్పాయింట్ చేస్తున్నాడు పవర్ స్టార్.

కానీ పవన్ ఇప్పుడు తన ఫ్యాన్ కోసం కదులుతున్నాడు. పవర్ స్టార్ కి వీరాభిమానిని అని చెప్పుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడని యంగ్ హీరో నితిన్ కోసం ఓ సినిమా ఈవెంట్ కదిలి వస్తున్నాడు. నితిన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఛల్ మోహన రంగ. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుండగా.. ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. ఈ నెల 25న ఛల్ మోహన రంగ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పిన నితిన్.. చీఫ్ గెస్ట్ ఎవరో చెప్పి.. పవన్ అభిమానులను ఖుషీ చేసేశాడు.

'నా నిర్మాత.. మన పవర్ స్టార్ ఛల్ మోహన రంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. మిగిలిన వివరాలు త్వరలోనే చెబుతా' అంటూ ప్రకటించాడు నితిన్. పవన్ తో పాటు.. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా.. మాటల మాంత్రికుడు మరో అతిథిగా.. జరగనున్న ఛల్ మోహన రంగ ఈవెంట్ పై ఇప్పుడు అందరి దృష్టి నిలుస్తోంది.
Tags:    

Similar News