పవన్ చేతి 'జనగనమణ' పాడించనున్న పూరి?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మదిలో చాలా ఏళ్లుగా ఉన్న జనగనమణ సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఆమద్య ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. కాని ఇప్పుడు ఆ సినిమాను మరో హీరో వద్దకు తీసుకు వెళ్లే విషయమై పూరి ఆలోచించాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అదే కథను పవన్ వద్దకు పూరి తీసుకు వెళ్లాడట. అవినీతి భారతంపై సాగే ఈ కథలో మంచి దేశ భక్తి ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమాను పవన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పూరి ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్ని కూడా పూర్తి అయితే తప్ప కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అంటే పూరి.. పవన్ ల కాంబో మూవీ పట్టాలెక్కాలంటే 2022 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మరియు సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాత పూరితో పవన్ మూవీ ఉంటుందా లేదా ముందే పూరికి డేట్లు ఇస్తాడా అనేది చూడాలి. మహేష్ కోసం రెడీ చేసిన ఆ స్టోరీ లైన్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లడంపై ఇద్దరు హీరోల అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్ని కూడా పూర్తి అయితే తప్ప కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అంటే పూరి.. పవన్ ల కాంబో మూవీ పట్టాలెక్కాలంటే 2022 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మరియు సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాత పూరితో పవన్ మూవీ ఉంటుందా లేదా ముందే పూరికి డేట్లు ఇస్తాడా అనేది చూడాలి. మహేష్ కోసం రెడీ చేసిన ఆ స్టోరీ లైన్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లడంపై ఇద్దరు హీరోల అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.