కబాలి తర్వాత సీన్ మారిందా?

Update: 2016-08-23 13:30 GMT
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదు. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు. రెండే రెండు సినిమాలతో రజినీ కాంత్ లాంటి సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే బంపరాఫర్ అందుకున్న దర్శకుడిగా అతడి పేరు ఏడాది పాటు మార్మోగిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు రంజిత్ తో పని చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపించారు. అతను మాత్రం సూర్య కోసం రెండు స్టోరీలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. ‘కబాలి’ విడుదలైన వెంటనే వాటిలో ఒకదాంతో సినిమా మొదలుపెడతానన్నాడు. కానీ ‘కబాలి’ విడుదలై నెల దాటింది కానీ.. అతడి తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు.

ఆల్రెడీ సూర్య కొన్నేళ్లుగా స్ట్రగుల్లో ఉన్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘24’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇలాంటి టైంలో రంజిత్ తో సినిమా ఏంటని కొంచెం పునరాలోచనలో పడ్డట్లుగా చెన్నై వర్గాల సమాచారం. మరోవైపు రంజిత్.. విజయ్ హీరోగా సినిమా చేస్తాడన్న ప్రచారం ఒకటి బయల్దేరింది. దీనిపై స్వయంగా రంజితే స్పందిస్తూ.. ప్రస్తుతం తాను స్క్రిప్టు మీదే దృష్టిపెడుతున్నానని.. ఏ హీరోతో కమిట్మెంట్ తీసుకోలేదని అన్నాడు. ఇంతకుముందేమో సూర్యతోనే పక్కా.. స్క్రిప్టే ఓకే కాలేదన్నాడు. ఇప్పుడు ఏ హీరోతో అన్నది ఖరారవ్వలేదు అంటున్నాడు. మొత్తానికి సూర్య.. రంజిత్ కు నో చెప్పేశాడన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
Tags:    

Similar News