ఇంట్రెస్టింగ్‌ : ‘ఓ పిట్టకథ’కు వంశీ ‘లేడీస్‌ టైలర్‌’కు లింక్

Update: 2020-02-19 01:30 GMT
విశ్వంత్‌ దుడ్డుంపూడి.. సంజయ్‌ రావ్‌.. నిత్య శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఓ పిట్టకథ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం టీజర్‌ మరియు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ఏమైపోతానే అనే పాటను విడుదల చేశారు. వాలెంటైన్స్‌ డే సందర్బంగా వచ్చిన ఆ పాట ప్రస్తుతం నెటిజన్స్‌ ను ఆకట్టుకుంటుంది.

ఓ పిట్టకథ లోని ఏమైపోతానే పాటకు వంశీ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్‌ మూవీ లేడీస్‌ టైలర్‌ లోని ఒక పాటతో ఉన్న పోలికను నిర్మాత వి ఆనంద్‌ ప్రసాద్‌ తెలియజేశాడు. ఏమైపోతానే పాట ట్యూన్‌ చేయకముందే అమలాపురం.. కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. పాట లేకుండా కేవలం విజువల్స్‌ ను క్యాప్చర్‌ చేశాం. కథను బట్టి పాట సందర్బాన్ని బట్టి షూటింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌ తిరిగి వచ్చి అప్పుడు పాటను ట్యూన్‌ చేయించినట్లుగా చెప్పాడు.

కాకతాళీయమో ఏమో కాని గతంలో వంశీ గారు లేడీస్‌ టైలర్‌ చిత్రంలోని ఒక పాటను మొదట చిత్రీకరించి ఆ తర్వాత ఇళయరాజాగారితో ట్యూన్‌ చేయించారంటూ చెప్పుకొచ్చారు. ఈ సిమిలారిటీతో ఓ పిట్ట కథపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తుంది. ఒక కొత్త కాన్సెప్ట్‌.. కొత్త వారు చేసిన ఈ సినిమా తప్పకుండా కొత్తగా ఉండి ఆకట్టుకుంటుందనే నమ్మకంను టీజర్‌.. పాటలు విన్న వారు అంటున్నారు. మరి సినిమా ఫలితం ఏంటీ అనేది మార్చి 6న సినిమా వస్తే క్లారిటీ వచ్చేయనుంది.


Tags:    

Similar News