'వస్తున్నా.. ప్రతి ఇంటికీ వచ్చేస్తున్నా' - ఎన్టీఆర్ గేమ్ షో ప్రారంభం ఎప్పుడంటే..?

Update: 2021-08-14 11:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. 'ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ మీసం మెలేసి ప్రోమోలతోనే అదరగొట్టాడు ఎన్టీఆర్. ఇదే క్రమంలో కొన్ని ఎమోషనల్‌ ప్రోమోలను రిలీజ్ చేసి ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో తాజాగా జెమిని టీవీ ఈ షో ప్రారంభం ఎప్పుడో తెలియజేస్తూ.. ఓ ప్రోమోను విడుదల చేసింది.

'ఎవరు మీలో కోటీశ్వరులు' క్విజ్ షో ఆగష్టు 22వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నట్లు వెల్లడించారు. ''వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. సోమవారం నుంచి గురువారం వరకు.. ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు.. మీ జెమిని టీవీలో..'' అని ఎన్టీఆర్ ఈ ప్రోమోలో తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఈ నెల 22న కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌ తో ఈ గేమ్ షో స్టార్ట్ చేసి.. ఆగస్టు 23 నుండి రెగ్యులర్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయనున్నారు.

కాగా, ఎన్టీఆర్‌ గతంలో 'బిగ్ బాస్' తెలుగు ఫస్ట్ సీజ‌న్ కు హోస్ట్ గా చేసి అలరించారు. ఇప్పుడు మరోసారి 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' కార్యక్రమంతో సందడి చేయనున్నారు. ఈ గేమ్ షో లో అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన వారికి రూ. కోటి ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఇది హిందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షో తరహాలో ఉంటుంది. గతంలో కింగ్ అక్కినేని నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో మూడు సీజన్స్ నిర్వహించారు. నాలుగో సీజన్‌ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News