ఎన్టీఆర్ లేకుండానే మొదలెట్టేశారు

Update: 2017-02-21 05:48 GMT
జనతా గ్యారేజ్ తో తన సత్తా చాటి.. ఇండస్ట్రీ హిట్స్ లో స్థానం సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్.. కొత్త సినిమా ప్రారంభానికి కొంచెం టైం తీసుకున్నా.. క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించేశాడు. రీసెంట్ గా ముహూర్తం షాట్ కూడా చిత్రీకరణ కూడా జరగగా.. ఇప్పుడీ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది.

బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్.. నిన్నటి నుంచి అధికారికంగా మొదలు కాగా.. హీరో ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ కు  హాజరు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. మూడు వారాల పాటు అసలు హీరో ఎపిసోడ్ లేకుండానే ఇతర సీన్స్ ను పిక్చరైజ్ చేయనున్నాడట బాబీ. మార్చ్ 20న యూనిట్ లో యంగ్ టైగర్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ మూవీలో చేస్తున్న 3 పాత్రల్లో వేరియేషన్ కోసం.. యంగ్ టైగర్ సీరియస్ గా వర్కవుట్స్ చేస్తుండగా.. మిగిలిన పాత్రలపై సీన్స్ షూటింగ్ జరుగుతోంది.

ఆగస్ట్ 11న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని షూటింగ్ చేస్తుండడంతో.. షెడ్యూల్స్ మిస్ అవకుండా దర్శకుడు బాబీ ఇలా హీరో లేకుండా షూటింగ్ చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యామ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై లవ కుశ అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా.. రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మరో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండగా.. వారిని ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News