మెగా అల్లుడి సినిమాని లైట్ తీసుకున్నారా..?

Update: 2022-01-13 17:20 GMT
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్.. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో 'విజేత' సినిమాతో హీరోగా పరిచయయ్యారు. ఫస్ట్ మూవీతో పర్వాలేదనిపించిన మెగా అల్లుడు.. ఇప్పుడు ''సూపర్ మచ్చి'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

'సూపర్ మచ్చి' చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మించారు. ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు. 'బంగార్రాజు' 'హీరో' 'రౌడీ బాయ్స్' వంటి సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి.. ఆఫ్ లైన్ లో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మెగా హీరో సినిమా విడుదల అంటే ఉండే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ హడావిడి చేస్తుంటారు. ఇక ఫ్యామిలీలోని మిగతా హీరోలు కూడా తమ వంతు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ 'సూపర్ మచ్చి' సినిమా విషయంలో ఇదేమీ కనిపించలేదు.

అయితే రామ్ చరణ్ 'రౌడీ బాయ్స్' మరియు 'హీరో' సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరై చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. దీనిని బట్టి మెగా హీరోలంతా కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' సినిమాను లైట్ తీసుకున్నారనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఇకపోతే 'సూపర్ మచ్చి' సినిమా విడుదల గురించి హీరో కళ్యాణ్ దేవ్ కూడా ఇంతవరకు ప్రమోట్ చేయలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు.. ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా నిర్వహించలేదు. అందులోనూ ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పకపోవడంతో కళ్యాణ్ కూడా తన చిత్రాన్ని లైట్ తీసుకున్నాడేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.

రేపు థియేటర్లలోకి వస్తున్న 'సూపర్ మచ్చి' సినిమా గురించి హీరోయిన్ రచిత రామ్ - మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ కూడా ప్రమోట్ చేయకపోవడం గమనార్హం. మరి ఎలాంటి ఆఫ్ లైన్ ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అవుతున్న మెగా అల్లుడి సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News