ఈ స్టార్ హీరోయిన్..సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిందా..!

Update: 2020-06-04 17:30 GMT
సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో హీరోయిన్లు అయిపోయి తెరమీద తమని తాము చూసుకోవాలని వస్తుంటారు. మొదట్లో సినిమాల ఎంపిక విషయంలో తప్పులు చేసినా తర్వాత తెలివిగా మంచి కథలను ఎంపిక చేసుకొని తమ కెరీర్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తారు. మంచి హిట్లు పడితే ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగుతారు. ప్లాప్ సినిమాలు ఎదురైతే కొంతకాలానికే కనిపించకుండా మాయమవుతారు. ఇండస్ట్రీలో చాలామంది కథానాయికలు అవకాశాల్లేక సినిమాలకు దూరం అవుతుంటారు. ఎవరైనా పిలిచి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. ఎగిరి గంతేసి చేసేద్దాం అనే ఆలోచనతో ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం చేతికి వచ్చిన అవకాశాల్ని చేతులారా వదులుకుంటుంటారు. నిత్యమీనన్ ఆ కోవకు చెందిందేనట. కొంతకాలంగా నిత్య తెలుగు తెరకు దూరమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నిత్య చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇలాంటి సమయంలో ఏదైనా అవకాశం వస్తే కళ్లకద్దుకొని ఓకే అనాలి. కానీ అమ్మడు కావాలనే నెగ్లెట్ చేస్తుందట. తాజాగా టాలీవుడ్‌లో 'కరణం మల్లీశ్వరి' బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ బయోపిక్ లో నటించే ఛాన్స్ ముందు నిత్యనే వరించిందట. కానీ నిత్య ఆసక్తి చూపించలేదని సమాచారం. నిజానికి కథ నచ్చకపోవడం వలన, పాత్ర నచ్చకపోవడం మూలనో కాదు.. మొత్తానికి తనకు సినిమాలంటేనే ఇష్టం లేదట. అందుకే చేయడం లేదని తేల్చి చెప్పేసి షాక్ ఇచ్చింది. ఇది వరకు కూడా అలాగే కొన్ని సినిమాల్ని ఇలానే వద్దనుకుంది. మొత్తంగా చూస్తుంటే నిత్యకు సినిమాలపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయినట్టు అర్థం అవుతోంది. సినిమాల్ని వదిలేసి, కొత్త కెరీర్ ఏమైనా మొదలెడుతుందేమో అని సినీ వర్గాలతో పాటు అభిమానులలో ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News