ఎన్టీఆర్ కోసం 'కత్తి'లాంటి విలన్

Update: 2017-06-10 05:55 GMT

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఇప్పుడు సౌత్ లో ప్రతినాయకుడు పాత్రలకు ఉన్న క్రేజ్ ని బాగా వాడుకుంటున్నాడు. హిందీలో హీరోగా ఇప్పుడు ఏమి ప్రొజెక్ట్స్ లేకపోవడంతో సౌత్ నుండి వస్తున్న అవకాశాలును అందిపుచ్చుకుంటున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమాను నేషనల్ వైడ్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నీల్ నితిన్ ముకేష్ తెలుగులో పరిచయం కాబోతున్నాడు అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు మరో తెలుగు పెద్ద ప్రాజెక్టులో చోటు కొట్టేశాడు.

జూ.ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవ కుశ’లో హీరోకు ప్రతినాయకుడు పాత్రను నీల్ నితిన్ ముకేశ్‌ చేస్తునట్లు జై లవ కుశ టీమ్ తెలిపారు. కాకపోతే పాత్ర వివరాలు చాల గోప్యంగా ఉంచుతున్నారులే. ఈ సినిమాకు అతను అయితేనే ఎన్టీఆర్ కు సరిసమానంగా నటించగలడు అని డైరెక్టర్ బాబీ (కె యెస్ రవీంద్ర) ఫీలయ్యాడట. నీల్ కూడా అతని పాత్ర చాలా  బాగా నచ్చడంతో.. కథ విన్న వెంటనే చేయడానికి ఒప్పేసుకున్నాడట. తన పంతం కోసం దేనికైనా ఎంతటికైనా తెగించే బ్యాడ్ బోయ్ గా కనపడనున్నాడు ఈ 'కత్తి' విలన్. ఆల్రెడీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాత్రలో విలనీ చూపించనుండగా.. ఇప్పుడు అతను మాత్రమే కాకుండా నీల్ కూడా విలనీ అంటే.. అబ్బో ఈ రచ్చేదో పీక్స్ కు వెళిపోయేలా ఉందే.

ఇకపోతే.. ఎన్టీఆర్ సినిమా ప్రభాస్ సినిమా కన్న ముందు విడుదల అవుతుంది కాబట్టి... ఈ 'కత్తి' ముందు సాహో లో నటించినా కూడా.. జై లవ కుశ ద్వారా తొలిసారి తెలుగు తెరపై కనిపిస్తాడనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News