మెగా కోడలి చేతుల మీదుగా విడుదలైన 'నాట్యం' ఫస్ట్ లుక్..!

Update: 2021-01-23 05:45 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూచిపూడి నృత్యం ఆధారంగా రాబోయే ఇన్స్పిరేషల్ డ్రామా ''నాట్యం'' ఫస్ట్ లుక్ పోస్ట ర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ కు చెందిన సుప్రసిద్ధ కూచిపూడి నర్తకి సంధ్యరాజు - రేవంత్ కొరుకొండ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. 'నాట్యం' ఫస్ట్ లుక్ లో సంధ్యారాజు క్లాసికల్ డ్యాన్సర్ గా ట్రెడిషనల్ శారీలో కనిపిస్తోంది. ఆమె వెనుక నటరాజు విగ్రహం ఆమె డ్యాన్స్ పోజ్ కు మరింత అందం చేకూర్చింది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇది సంధ్యరాజుకు డెబ్యూ మూవీ. సంధ్య తన నటన మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'నాట్యం' అనగా డ్యాన్స్ ద్వారా ఒక కథను అందమైన రీతిలో చెప్పడం. ఈ చిత్రంలో ఇక డ్యాన్స్ గురువు మరియు అతని శిష్యురాలి మధ్య ముడిపడిన ప్రత్యేకమైన ప్రేమకథను చూపించబోతున్నారు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రాఫర్ - ఎడిటింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు - రోహిత్ బెహల్ - ఆదిత్య మీనన్ - శుభలేఖ సుధాకర్ - భానుప్రియ - బేబీ దీవానా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రావన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని హంపి - లేపాక్షి - బెంగళూరు మరియు హైదరాబాద్ లోని అందమైన ఆర్కిటెక్ట్ దేవాలయాలలో ఈ సినిమాని షూట్ చేస్తున్నారు. 'నాట్యం' చిత్రం నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందుతోంది.
Tags:    

Similar News