కూతురి కొత్త ఇంటి వ్యూ చూసి ప‌డిపోయిన ర‌జ‌నీ

ఈసారి చెన్నైలోని అద్భుత‌మైన బీచ్ వ్యూలో కొత్త అపార్ట్ మెంట్ ని పూజా కార్య‌క్రమాల‌తో లాంచ్ చేసారు ఈ ప్ర‌తిభావ‌ని.

Update: 2024-05-04 03:30 GMT

ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ పేరు మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. ఐశ్వ‌ర్య స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `లాల్ స‌లాం` డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకోవ‌డం.. అటుపై భ‌ర్త ధ‌నుష్ నుంచి విడాకులు తీసుకోవ‌డం .. ఇవి రెండూ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారాయి. ఇప్పుడు ఒక మంచి కార‌ణంతో మ‌రోసారి హెడ్ లైన్స్ లోకొచ్చారు ఐశ్వ‌ర్య‌. ఈసారి చెన్నైలోని అద్భుత‌మైన బీచ్ వ్యూలో కొత్త అపార్ట్ మెంట్ ని పూజా కార్య‌క్రమాల‌తో లాంచ్ చేసారు ఈ ప్ర‌తిభావ‌ని.

జనవరి 2022లో ధనుష్ నుండి విడిపోయిన తరువాత ఐశ్వర్య తన తల్లిదండ్రులు ర‌జ‌నీకాంత్ - ల‌తా ఇంట్లో త‌న‌ పిల్లలతో క‌లిసి నివసించారు. ఇప్పుడు సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుని కొత్త అధ్యాయానికి తెర తీసారు. చెన్నై తీరప్రాంతానికి అభిముఖంగా ఉన్న ఈ అద్భుతమైన కొత్త‌ ఇంటిని ఐశ్వ‌ర్య‌ కొనుగోలు చేసింది. ఈ ఇంటికి ఇంకా హంగులు అద్దాల్సి ఉన్నా కానీ, ఇటీవల గృహప్రవేశ వేడుకను కానిచ్చేయ‌డం శుభ ప్రారంభాన్ని సూచిస్తుంది. రజనీకాంత్ .. ఆయ‌న‌ భార్య లత ఇద్దరూ తమ కుమార్తె కొత్త ఇంటి ప్రారంభోత్స‌వానికి విచ్చేశారు. వారితో పాటు పెద్ద కూతురు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ కుమారుడు కూడా ఈ వీడియోలో క‌నిపించారు.

Read more!

అలాగే రజనీకాంత్ -ల‌త దంప‌తులు కొత్త‌ ఇంటిని నిశితంగా ప‌రిశీలిస్తున్న వీడియో ఆక‌ట్టుకుంది. ఈ ఇంటిని సొగసైన పాలరాతి ఫ్లోరింగ్ స‌హా ఆకర్షణీయమైన కళాకృతులతో డిజైన్ చేసారు. కూతురు ఐశ్వర్య గర్వంగా తన స్వర్గధామాన్ని లాంచ్ చేయ‌డం చూసి ర‌జ‌నీ-ల‌త మురిసిపోయారు.

ఐశ్వర్య-ధనుష్ విడాకుల ప్ర‌హ‌స‌నం గురించి తెలిసిందే. రెండేళ్ల క్రిత‌మే ఈ జంట విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. విడాకులను ఖరారు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో సెటిల్‌మెంట్ జ‌రిగింది. జ‌నవరి 2022లో వారి షాకింగ్ స్ప్లిట్ ప్రకటన అభిమానులను షాక్‌కి గురి చేసింది. 17 జనవరి 2022న త‌మ‌ 18 సంవత్సరాల వివాహ‌బంధానికి ముగింపు పలికామ‌ని ఈ జంట‌ ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో గోప్యతను అభ్యర్థిస్తూ ఐశ్వర్య సోషల్ మీడియా సంయ‌మ‌నాన్ని పాటించాల‌ని కోరుకున్నారు. ఇప్పుడు తన కొత్త ఇంటి ప్ర‌వేశాన్ని ప్ర‌క‌టించి ఐశ్వ‌ర్య మ‌రో కొత్త శుభారంభాన్ని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News