కోడలు పిల్లతో షూటింగ్ ఫుల్ ఫన్: నాగార్జున

Update: 2019-05-21 17:44 GMT
అక్కినేని నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను పోర్చుగల్ లో పూర్తి చేసుకొని 'మన్మథుడు' టీమ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది.  ఈ సందర్భంగా నాగార్జున పోర్చుగల్ షూటింగ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

కోడలమ్మ సమంతాతో కలిసి ఉన్న ఒక ఫోటో ను పోస్ట్ చేసి "కోడలు పిల్లతో షూటింగ్ లో పాల్గొనడం చాలా సంతోషం. షూటింగ్ చాలా సరదాగా సాగిపోయింది. త్వరలోనే మరి కొన్ని ఫోటోలు షేర్ చేస్తాను" అంటూ ట్వీట్ చేశారు.  ఈ ఫోటోలో సమంతా ఒక గొడుగును మామగారికి కూడా నీడ వచ్చేలా పట్టుకుంది. ఇక మామ కోడలు ఇద్దరూ నవ్వులే నవ్వులు.   'మన్మథుడు 2' లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.  కీర్తి సురేష్.. సమంతాలు క్యామియో పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి పాత్ర నిడివి తక్కువే అయినా కథలో వారి పాత్రలు కీలకమని ఫిలిం యూనిట్ సభ్యులు అంటున్నారు.

నాగార్జున తన కోడలమ్మతో కలిసి నటించడం ఇదేమీ మొదటి సారి కాదు. చైతన్య- సమంతాల వివాహం కాకముందే 'మనం' లో నాగార్జున సమంతా తో కలిసి నటించారు. చైసామ్ ల పెళ్ళి తర్వాత నాగార్జున.. సమంతాలు 'రాజుగారి గది 2' చిత్రంలో నటించారు.  ఇప్పుడు మరోసారి నాగ్ తన కోడలుపిల్లతో కలిసి నటిస్తున్నారు.   ఇదిలా ఉంటే 'మన్మథుడు 2' సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 70 శాతం పైగా పూర్తి అయిందట.  ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట.
Tags:    

Similar News