ఆటగాళ్ళు మొదలెట్టేశారు!!

Update: 2017-12-13 08:36 GMT
కెరీర్ మొదట్లో కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలతో వచ్చి తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ ను అందుకున్న నారా రోహిత్ ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చి కొంచెం డిజాస్టర్స్ జిని అందుకున్నాడు. మొదట విజయాలు అంతగా అందుకోకపోయినా కూడా రోహిత్ మంచి ప్రయత్నం అయితే చేశాడు అనే టాక్ వచ్చేది కానీ ఈ మధ్య స్టైల్ మార్చడంతో డిజాస్టర్స్ ని చూడక తప్పడం లేదు. అయితే మళ్లీ తన శైలిలో ఒక సినిమాతో వచ్చి హిట్టు కొట్టడానికి రెడీ అయ్యాడు.

గతంలో నీ స్నేహం - ఆంధ్రుడు సినిమాలను తీసి దర్శకుడిగా క్లిక్ అయినా పరుచూరి మురళి నారా రోహిత్ తో ఆటగాళ్లు అనే సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. మురళి 2012లో అధినాయకుడు సినిమా తర్వాత మళ్లీ మరొక సినిమాను చేయలేదు. ఆ మధ్యలో ఓ సినిమాను స్టార్ట్ చేద్దామని అనుకున్నా మొదట్లోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు సరికొత్త కథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఓ కొత్త తరహా కథను ఎంచుకొని నారా రోహిత్ తో చేతులు కలిపాడు.

ఆ సినిమా షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయ్యింది. జగపతి బాబు ఈ కథలో ఒక కీలక పాత్రను  చేయనున్నారు. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బావుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేస్తారట. 2018 మధ్యలోనే సినిమా రిలీజ్ ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంది.  
Tags:    

Similar News