టీజర్ టాక్: మరీ ఇంత కన్ఫ్యూజనా?

Update: 2017-06-26 07:37 GMT
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ఆశ్చర్యపరిచిన శ్రీ విష్ణు.. మరో ప్రామిసింగ్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అతను కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మెంటల్ మదిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్లెజెంట్ ఫీలింగ్ ఇవ్వగా.. తాజాగా రిలీజైన ఈ చిత్ర టీజర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. టీజర్ వెరైటీగా కట్ చేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించింది చిత్ర బృందం.

ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అయ్యే కుర్రాడి కథ ఇది. అనగనగా ఒక రాజు.. అతను యుద్ధం చేయాలనుకున్నాడు.. కానీ యుద్ధానికి గుర్రం మీద వెళ్లాలా.. రథం మీద వెళ్లాలా అని కన్ఫ్యూజ్ అవుతుండగా.. శత్రు సైన్యం వచ్చి అతణ్ని చంపేశారు అంటూ శ్రీ విష్ణు వాయిస్ తో వినిపించే ఓ కథ ద్వారా కథానాయకుడి గందరగోళ మనస్తత్వాన్ని పరిచయం చేశారు టీజర్లో. అరవింద్ కృష్ణ అనే తన పేరును అవతలి వాళ్లు అరవింద్ అని పిలుస్తారా.. కృష్ణ అని పిలుస్తారా అని హీరోకు కన్ఫ్యూజన్.

ఇలా అన్నింటికీ కన్ఫ్యూజ్ అయ్యే హీరో తన జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా. టీజర్ అయితే ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ‘పెళ్లిచూపులు’ తర్వాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న సినిమా ఇది కావడం విశేషం. ఈ చిత్రంతో శ్రీవిష్ణు సరసన నివేదా పేతురాజ్ నటిస్తోంది.


Full View
Tags:    

Similar News