మానస సరోవరంలో మంచు లక్ష్మి

Update: 2017-09-12 04:31 GMT
సినిమా ఇండస్ట్రీలోని వాళ్లు ఇంట్లో ఉండేకన్నా టూర్లలో ఉండేదే ఎక్కువ. షూటింగుల్లో భాగంగా ఎక్కడెక్కడికో వెళ్లొస్తుంటారు. ఈమధ్య ఇంతవరకు ఎవరూ తెరకెక్కించని ప్రదేశాల్లో షూట్ చేయాలని కొత్త ప్రదేశాలు వెతుక్కుని మరీ బయలుదేరి వెళ్తున్నారు. రీసెంట్ గా మోహన్ బాబు కుమార్తె కూడా ఓ టూర్ కు వెళ్లింది. అయితే ఇది విహార యాత్ర కాదు. ఆధ్యాత్మిక యాత్ర. అది కూడా ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటైన మానస సరోవరానికి.

మంచు లక్ష్మి ఈ యాత్ర విజయవంతంగా పూర్తి చేసిందంటూ ఆమె తండ్రి మోహన్ బాబు అభిమానులతో ఆనందం పంచుకున్నాడు. ట్విటర్ ద్వారా అందరికీ ఈ విషయం చేశారు. ఆమె అక్కడకు వెళ్లడమే కాకుండా వాట్సాప్ లైవ్ ద్వారా  తనకు కూడా ఈశ్వర దర్శన భాగ్యం కల్పించిందని ఉప్పొంగిపోయారు. ‘నా కుమార్తె లక్ష్మీప్రసన్న మానస సరోవర యాత్ర పూర్తి చేసి కైలాసనాథుని ఆశీస్సులు పొందింది. వాట్సాప్‌ లైవ్‌ లో నాకు కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలగడంతో నా జీవితం ధన్యమైంది. ఆ మహాదేవుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. శంభోశంకర’ అని మోహన్‌ బాబు ట్వీట్ చేశారు. తన యాత్రకు సంబంధించిన చిత్రాలు.. వీడియోలను మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తున.. టిబెట్ లో ఉన్న మానస సరోవర యాత్ర చేయడం అంత తేలికేం కాదు. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ కు వెళ్లిరావడమే ఓ రకంగా పెద్ద సాహసం. దానికితోడు వాతావరణం కూడా ఓ పట్టాన సహకరించదు. ఎంతో భక్తి - పట్టుదల ఉంటేనే వెళ్లిరాగలరు. మంచు లక్ష్మి అంత పట్టుదలతో యాత్ర పూర్తి చేయడం అభినందనీయమే.
Tags:    

Similar News