సావిత్రి..శ్రీదేవిపై తోట‌ప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మ‌హాన‌టి సావిత్రి...అతిలోక సుంద‌రి శ్రీదేవి సినిమా జ‌ర్నీగురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-04-28 19:19 GMT

మ‌హాన‌టి సావిత్రి...అతిలోక సుంద‌రి శ్రీదేవి సినిమా జ‌ర్నీగురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సావిత్రి త‌రం త‌ర్వాత ఇండ‌స్ట్రీలో అంత‌గా ఫేమ‌స్ అయింది శ్రీదేవి. ఆ ర‌కంగా ఇద్ద‌రు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి రెండు క‌ళ్లు. ఎన్నో చిత్రాల‌తో..వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించి త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర‌ను రాసుకున్నారు. హీరోయిన్ల గురించి మాట్లాడాల్సి వస్తే సావిత్రి...శ్రీదేవి ముందు త‌ర్వాత అని క‌చ్చితంగా చెబుతారంతా. తాజాగా వాళ్లిద్ద‌రి గురించి సీనియ‌ర్ ర‌చ‌యిత తోట‌ప‌ల్లి మ‌ధు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

సావిత్రి..శ్రీదేవి ఇద్ద‌రికి విప‌రీత‌మైన మ‌ద్యం అల‌వాటుంద‌న్నారు. సావిత్ర మ‌ద్యానికి బానిస‌వ్వ‌డానికి కార‌ణం వాళ్లు తాగించారు. వీళ్లు తాగించార‌ని అంతా చెబుతారు కానీ అది వాస్త‌వం కాదు. తాగ‌డం అల‌వాటు చేసుకు న్నాక‌..తాగ‌డం..తిన‌డం అల‌వాటుగా మారింది. లావు అవుతున్నావ్ అని ఎవ‌రూ చెప్పినా వినేవారు కాదు. లావు అవుతున్నానే బెంగ‌తో ఇంకా ఎక్కువ‌గా తాగేవారు. ఆవిడ తాగి 14ఏళ్లు బ్ర‌తికితే శ్రీదేవి అదే తాగుడు అల‌వాటు తో 14 నిమిషాల్లోనే చ‌నిపోయింది. 55 ఏళ్ల‌కే శ్రీదేవికి బీపీ..షుగ‌ర్ వ‌చ్చేసాయి.

Read more!

అప్ప‌టికే తాగే అల‌వాటు కూడా ఉంది. శ్రీదేవికి విప‌రీత‌మైన ఇన్పిరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఐశ్వ‌ర్యా రాయ్..క‌త్ర‌నా కైఫ్..దీపీకా ప‌దుకొణే ఇలా ఇంత మంది అంద‌మైన హీరోయిన్లు వ‌స్తే నా ప‌రిస్థితి ఏంటి? అని అనుకునేవారు. ఆ కార‌ణంతో చీటికి మాటికి ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీల‌కు వెళ్లేవారు. దానికి తోడు అందంగా క‌నిపించ‌డం కోసం తిండి తినేవారు కాదు. తిన్నా అందులో ఉప్పు కారం లేకుండా ఉండేవి. తాగే అల‌వాటుతో బాగా తాగి బాత్ రూమ్ లోకి వెళ్లి కోమాలోకి వెళ్లిపోయారు. ఆవిడ చ‌నిపోయ‌వ‌డానికి కేవ‌లం14 నిమిషాలే ప‌ట్టింది.

మ్యాక‌ప్ అనేది మ‌త్తు ప్ర‌పంచం. దానికి అల‌వాటు ప‌డితే ఉండ‌లేరు. ఇండ‌స్ట్రీలో అందంగా క‌నిపిచ‌డం కోసం ఒక‌ప్పుడు మ‌ద్యం తీసుకునే వారు. ఇప్పుడు డ్ర‌గ్స్ వాడుతున్నారు. మాద‌క ద్ర‌వ్యాలు వాడితే మ‌రింత అందంగా క‌నిపిస్తార‌ని డాక్ట‌ర్లు స‌ల‌హాలు ఇస్తారు. వాళ్లే ఇంజెక్ష‌న్లు ఇస్తుంటారు. వ‌ర్కౌట్లు కూడా ఎక్కువ సేపు చేయ‌గ‌ల్గుతారు` అని అన్నారు.

Full View
Tags:    

Similar News