అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్!

Update: 2020-08-04 09:50 GMT
ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ కం కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై గతరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో క్వారంటైన్లో జాయిన్ అయ్యారు. పృథ్వీరాజ్ అనారోగ్యం వార్తతో అటు ఇండస్ట్రీ పరంగా.. ఇటు అభిమానులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరూ కూడా ప్రస్తుతం పృథ్వీరాజ్ ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాలేదని స్వయంగా పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై నుండే సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పృథ్వీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం అండి! గత కొన్నిరోజుల నుండి తీవ్రమైన అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నాను. అన్నీ టెస్టులు చేయించాను. కొన్ని చోట్ల కోవిద్ నెగటివ్, కొన్ని సార్లు పాజిటివ్ అన్నారు. మళ్లీ సిటి స్కాన్లు లాంటివి చేయించామని అన్నారు.

అలాగే డాక్టర్లు కొన్నిట్లో నెగటివ్ కావచ్చు కాబట్టి మీరు ఓ పదిహేను రోజులు క్వారంటైన్ లో జాయిన్ అవ్వాలని అన్నారు. సరే అని నిన్న ఆగస్టు 3న మిడ్నైట్ క్వారంటైన్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అందువల్ల నాకు భయంగానే ఉంది. వెయిటింగ్ ఫర్ గుడ్ హెల్త్. మీ అందరి ఆశీస్సులు.. ఆ వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీరాజ్" అంటూ పృథ్వీరాజ్ ఆ వీడియోలో ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ గురించి ప్రతీ ఒక్కరూ మనసులో దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీకి ఆయన చేస్తున్న సేవలు మరిచిపోలేనివి. పృథ్వీరాజ్ మాట్లాడుతుంటే ఆయాస పడుతూ.. శ్వాస తీసుకువడంలో ఇబ్బందులు ఉన్నట్లుగా అర్ధమవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సామాన్యులు కూడా పృథ్వీరాజ్ కోలుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News